English | Telugu

డ్రామా జూనియర్స్ లో పృద్వి...చిరు, బాలయ్య రోల్స్ లో చిన్నారులు

డ్రామా జూనియర్స్ సీజన్ 6 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి సీనియర్ నటుడు పృద్వి ఎంట్రీ ఇచ్చారు. "సీజన్ 1 నుంచి చూస్తున్నాను. ఏమిటి నన్ను ఇంకా పిలవలేదు అనుకున్నాను ఇప్పుడు పిలిచారు" అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత ఫైర్ పండు అనే చిన్నారి వచ్చి మ్యాజిక్ చేసి చూపించాడు.. జడ్జి శ్రీదేవి నవ్వులోనే మ్యాజిక్ ఉంది అంటూనే, జయప్రద గారు మీ వయసును మార్చేశారు కదూ అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చేసాడు. ఆ మాటకు తన వయసు ఇంకా స్వీట్ 16 అని చెప్పారు జయప్రద. "మరి నా గురించి ఎం చెప్తావ్ అని బాబు మోహన్ అడిగేసరికి అచికిబుచ్చికి" అంటూ కామెడీ చేసాడు. ఇక ఇందులో లోహిత్ అండ్ టీం అంతా కలిసి 1980 స్ రీ యూనియన్ పేరుతో హీరో హీరోయిన్స్ అందరం ఎక్కడ ఉన్నా కూడా ఏడాదిలో ఒక సారి కలుసుకుంటాం అని చెప్పి ఎంటర్టైన్ చేశారు. ఇక లోహిత్ చిరంజీవిగా, విజయ్ బాలయ్యగా చేశారు.

చిన్నారి ఆడపిల్లలంతా కూడా మైదాపిండితో బిర్యానీ చేయడం దాన్ని చూసి చిరు రోల్ లో చేసిన లోహిత్ తప్పించుకోవడానికి ఇప్పుడే సురేఖ ఫోన్ చేసింది..బాలయ్యకు పెట్టు, చాలా ఆశగా ఎదురు చూస్తున్నాడు అంటూ బాలయ్య రోల్ లో చేసిన విజయ్ ని చూపించడం చాలా ఫన్నీగా ఉంది. స్నిగ్ధ అనే చిన్నారి అత్తగారి రోల్ లో అలాగే కూతురిగా హిమాంజలి అని చిన్నారి చేసిన స్కిట్ లో పృద్వి నటించారు. తర్వాత మరో ముగ్గురు చిన్నారులు వచ్చి రాముడు, లవకుశల స్కిట్ ని వేసి అందరినీ అలరించారు. ఇది చాలా బ్యూటిఫుల్ షో అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు పృద్వి. ఈ షోలో స్టార్టింగ్ నుంచి లోహిత్, హిమాంజలి, విజయ్, స్నిగ్ద, జనని, మంచి మంచి స్కిట్స్ వేస్తూ ప్రతీ వారం వాళ్ళ వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక లాస్ట్ వీక్ ఈ షోకి వచ్చిన హిడింగా మూవీ టీమ్ కూడా ఈ చిన్నారులకు దిష్టి తగలకూడదు అంటూ వాళ్లకు దిష్టి తీశారు.


Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.