English | Telugu

పుట్టినరోజు బహుమతిగా ఖరీదైన కారు, డైమండ్ నెక్లెస్ అందుకున్న అష్షు

అష్షు రెడ్డి సోషల్ మీడియా స్టార్. ఇప్పుడు అష్షు రెడ్డి ఒక కార్ ఓనరమ్మ అయ్యింది. అష్షు పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి నుండి లగ్జరీ బెంజ్ కారుని బహుమతిగా పొందింది . ఈ విషయం తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. " ఈ సంవత్సరంలో నేను అందుకున్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇదే.." అంటూ టాగ్ లైన్ పెట్టింది అష్షు. కారుతో పాటు తన తండ్రితో దిగిన ఫోటోలను కూడా పోస్ట్ చేసింది . ప్రస్తుతం ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తన పుట్టిన రోజు సందర్భంగా ఎవరినుంచో మంచి కాస్ట్లీ గిఫ్ట్ కూడా అందుకుంది అష్షు. ఒక జ్యువెలరీ షాప్ కి వెళ్లిన అష్షు అక్కడ ఉన్న డైమండ్ నెక్లెస్ లు చాలా వాటిని ట్రై చేసింది.

ఫైనల్ అన్ని మోడల్స్ లోకి ఒకటి సెలెక్ట్ చేసుకుంది. దాని ఖరీదు రూ. 7.5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ ను సొంతం చేసుకుంది. ఇక తన బర్త్ డే ని చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది. రామ్ గోపాల్ వర్మ కూడా ఈ బర్త్ డే పార్టీ కి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేశారు. అలాగే తన ఫ్రెండ్స్ , బుల్లితెర నటులు బిగ్ బాస్ హౌస్ మిత్రులతో ఫుల్ జోష్ తో పుట్టిన రోజును సెలెబ్రేట్ చేసుకుంది అష్షు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.