English | Telugu

బిగ్ బాస్ 7 కి ట్రై చేశా...కానీ కుదర్లేదు..బ్రాండ్స్ ప్రమోషన్స్ కి వచ్చే పే ఎంతో తెలుసా ?

ఢీ షోలో కంటెస్టెంట్ గా ఉన్న అన్షు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె అటు సీరియల్స్ కూడా చేస్తూ ఉంటుంది. ఇక బిగ్ బాస్ గురించి ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది. "నేను బిగ్ బాస్ సీజన్ 7 కి ట్రై చేశా కానీ లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 8 కల్లా నేను సీరియల్ కమిట్ అయ్యాను. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్. దాంతో అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే అదే ఛానెల్ లోని సీరియల్ కాబట్టి ఇక ఇప్పుడు బిగ్ బాస్ అంటే కష్టం." అని చెప్పింది అన్షు రెడ్డి. "నన్నైతే ఇంతవరకు ఎవరూ అప్రోచ్ కాలేదు. ఇంటరెస్ట్ ఉంది ఎందుకంటే లైఫ్ లో దొరికే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ కదా అందుకే. బిగ్ బాస్ కి వెళ్లడం ఎందుకు ఇష్టం అంటే నన్ను నేను చూసుకోవచ్చు. నేనేంటో నాకు తెలీదు. నేను రోజూ అద్దం ముందు నిలబడి చూసుకోలేను కదా. ఏ సిట్యువేషన్ కి ఎలా రియాక్ట్ అవుతానో కూడా నాకు తెలీదు. నేనేంటో తెలుసుకోవాలి, నేను ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటానో తెలియాలి అనే ఒక ఇంటరెస్ట్ ఉంది. అందుకే బిగ్ బాస్ కి వెళ్ళాలి అనుకుంటున్నా. ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం సోషలైజ్ అవడం నేర్చుకుంటున్నాం. మంచి ఫ్రెండ్స్ ని చేసుకుంటున్నాం అని చెప్పింది శ్రీప్రియా. "ఇది వరకు ఫస్ట్ పే 70 రూపాయలు తీసుకున్నా...ఇప్పుడు రోజుకు బ్రాండ్స్ కి ప్రమోషన్స్ అలాంటివి చేసినప్పుడు 7 లక్షలు అలా వస్తాయి. ఇది వరకు యూట్యూబ్ మీద మంచి పేమెంట్ వచ్చేది. కానీ ఇప్పుడు అసలు యాక్టివ్ గా ఉండడం లేదు" అని చెప్పింది అన్షు రెడ్డి.
---------

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.