Read more!

English | Telugu

'అరుంధతి' స్పూఫ్‌తో అదరగొట్టిన లాస్య, రవి!

 

బుల్లితెర మీద రవి, లాస్యల కాంబినేషన్ అప్పట్లో పెద్ద హిట్. ఉదయం పాటల ప్రోగ్రాంతో పలకరించే ఈ జంట మరికొన్ని టీవీ షోలలో కూడా సందడి చేసేది. ఆ తరువాత వాళ్ల క్రేజ్ తగ్గింది. పైగా ఇద్దరికీ గొడవలు వచ్చి విడిపోయారు. అలా దాదాపు ఐదేళ్లుగా వీరు విడిగానే ఉన్నారు. ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీ అయ్యారు. అయితే ఈ మధ్య మళ్లీ ఇద్దరూ కలిసిపోయారు. 

అంతేకాదు, ప్రస్తుతం ఇద్దరూ కలిసి 'కామెడీ స్టార్స్' షోలో సందడి చేస్తున్నారు. రవితో కలిసి ఒకప్పటి మ్యాజిక్ ను రీక్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తోంది లాస్య. 'కామెడీ స్టార్స్' షోలో టాలీవుడ్ హిట్ సినిమాలను స్పూఫ్ లుగా చేస్తూ కామెడీ పండిస్తున్నారు. గతంలో 'ఉప్పెన', 'నరసింహ', 'నువ్వొస్తానంటే నేనొద్దాంటానా' వంటి సినిమాలను స్పూఫ్ చేసి కామెడీ పండించారు. 

తాజాగా 'అరుంధతి' సినిమాను స్పూఫ్ చేశారు. అరుంధతిగా లాస్య‌.. పశుపతిగా ర‌వి వేషాలు వేశారు. రవి స్టేజ్ పైకి రాగానే 'లాస్య ఆంటీ అయిందే' అంటూ పంచ్ వేసేశాడు. ఆ తరువాత లాస్య నవ్వుని చూసుకుంటూ 'చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే' పాట వేసుకున్నాడు రవి. ఐదేళ్లుగా నీకో విషయం చెబుదామనుకుంటున్నా అంటూ రవిపై సమాధి వేసి మూసేస్తూ 'స్టే హోమ్ స్టే సేఫ్' అంటూ మెసేజ్ ఇచ్చింది లాస్య. ఆ త‌ర్వాత స‌మాధిలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి, "ఐదేళ్లు సమాధిలో కుళ్ల‌బెట్టిన నిన్ను ఈ రోజు వ‌ద‌ల బొమ్మాళీ".. అంటూ హ‌ల్‌చ‌ల్ చేశాడు ర‌వి.