English | Telugu

79 ఏళ్ల వ‌య‌సులో సుమ తల్లి ఏం చేస్తోందో చూశారా..?

యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. బుల్లితెరపై, సినిమా ఈవెంట్స్ తో సుమ చాలా బిజీగా ఉంటుంది. స్టార్ హీరోలపై కూడా సుమ సెటైర్లు వేస్తుంటుంది. కానీ ఇప్పటివరకు నెగెటివిటీ అనేది ఎప్పుడూ రాలేదు. అలాంటి సుమను ఈ మధ్య నెటిజన్లు ట్రోల్ చేశారు. తనపై వచ్చిన ట్రోలింగ్ పై స్పందిస్తూ సుమ ఘాటు కౌంటర్ ఇచ్చింది. గత వారంలో సుమ ఓ లేగ దూడకు సంబంధించిన వీడియో షేర్ చేయగా.. అందులో ఆ దూడ మూతికి వెదురు బుట్టి కట్టి ఉండడంతో అందరూ సుమను తిట్టారు. ఆవుపాలు దూడకు ఇవ్వకుండా ఇలా ప్రవర్తించడం ఏంటంటూ సుమని ప్రశ్నించారు. దీనిపై సుమ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆ మేటర్ కి ఫుల్ స్టాప్ పడింది.

తాజాగా సుమ మరో వీడియో షేర్ చేసింది. ఇందులో తన తల్లి గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. తన తల్లికి 79 ఏళ్లు వచ్చినా కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని.. రోజూ ఆమె చేసే వ్యాయామం, అలవాట్ల గురించి వివరించారు. రోజూ ఎలా ఉన్నా కూడా కచ్చితంగా వాకింగ్, సైకిల్ తొక్కడం, వ్యాయామం అన్నీ చేస్తానని సుమ తల్లి చెప్పుకొచ్చింది.

మనసు, మైండ్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని.. దానికి ఉదాహరణ తన తల్లేనని చెప్పిన సుమ.. 79 ఏళ్లు వచ్చినా కూడా తన తల్లి ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారని చెప్పుకొచ్చింది. ప్రతీరోజూ వ్యాయామం చేస్తూ.. ఆరోగ్యకరమైన ఆహరం తీసుకుంటారని.. ఏం జరిగినా కూడా అవి మాత్రం మానదని.. ఆమె నిక్ నేమ్ బేబీ అని చెప్పిన సుమ.. తను షేర్ చేసిన వీడియోలను అమ్మలందరికీ అంకితమని చెప్పుకొచ్చింది.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.