English | Telugu

అతని మాటల్ని సీరియస్ గా తీసుకుని ఉంటే బాగుండేది అని సారీ చెప్పిన రష్మీ

రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజి మీద అతనికి సారీ చెప్పింది. ఈ వారం కాయిన్స్ ఎపిసోడ్ లో భాగంగా రష్మీ ఒక గ్లాస్ లోని జ్యూస్ తాగితే అందులో గోల్డ్ కాయిన్ వచ్చింది. "నేను న లైఫ్ లో ఒక మనిషికి సారీ చెప్పాలి. ఆ మనిషి ఎవరో మీ అందరికీ కూడా బాగా తెలుసు. అతను తన టాలెంట్ ని ఈ స్టేజి మీద చూపించేటప్పుడు నేను అంతగా పట్టించుకోలేదు. ఐతే ఈ జర్నీలో ఎన్నో విషయాలు చెప్పాడు. మొదట్లో పట్టించుకోలేదు కానీ తర్వాతర్వాత అతను పెర్ఫార్మ్ చేసే స్కిట్స్ కి కనెక్ట్ ఇపోయా. అందుకే మనస్ఫూర్తిగా సారీ చెప్పాలని అనుకుంటున్నా. ఆ రోజు ఆయన చెప్పిన మాటల్ని సీరియస్ గా తీసుకుని ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు.

ఆ బాబు ఎవరో కాదు మన ఆర్టిస్ట్ బాబు. అప్పట్లో ఆయన వేసిన వేషాలకు యాక్టర్ బాబు కాస్త రైటర్ బాబు అయ్యాడు. అప్పుడు మేమంతా సీరియస్ గా తీసుకున్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాడు. అవకాశం ఇవ్వకపోతే కోసుకుంటా అని బెదిరించాడు అందుకే ఈ రైటర్ బాబుని ఆర్టిస్ట్ బాబుగా మార్చాను. అందుకు ఆడియన్స్ కి సారీ" అని చెప్పింది రష్మీ. రష్మీ ఇంతలా చెప్తూండేసరికి మొదట అందరూ సుడిగాలి సుధీర్ గురించి అనుకున్నారు కానీ ఫైనల్ గా బాబు అనేసరికి అందరూ ఫీలయ్యారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.