English | Telugu

మేస్త్రిగా మారిన ఒకప్పటి యాంకర్...


యాంకర్ ఝాన్సీ ఏది చేసినా అందులో ఒక స్పెషాలిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఝాన్సీ ఈ మధ్య కాలంలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. అలాగే తన అప్ డేట్స్ ని షేర్ చేస్తూ ఫాన్స్ ని పెంచుకునే ప్రయత్నంలో ఉంది. అలాంటి ఇప్పుడు మేస్త్రిగా అవతారమెత్తింది. అదేంటి అనుకుంటున్నారా..ఝాన్సీ ఒక గమేళాలో మట్టి పట్టుకొస్తే మరో అమ్మాయి భాను గోడ మీద పెయింట్ బ్రష్ తో బొమ్మలు వేస్తోంది. ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.

"నా డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం మా అమ్మాయిలంతా తమ హృదయాల్లో ఉన్న కళను బయటపెట్టడం కోసం మట్టి, సున్నంతో ప్రయోగాలు చేసి చెరువును . అందులో తామర పూలను సృష్టిస్తున్నారు" అని కాప్షన్ పెట్టింది ఝాన్సీ. ఈ వీడియోకి నటి ప్రగతి హార్ట్ ఇమేజెస్ ని పోస్ట్ చేస్తే, మిగతా వాళ్లంతా ఈ ఏరియా ఎక్కడ, చెప్పక్కర్లేదు..మంచి ఆర్ట్ రూపుదిద్దుకుంటోంది...ఈ ఆర్ట్ రిజల్ట్ కోసం వెయిట్ చూసున్నాం..." అంటూ రిప్లైస్ ఇస్తున్నారు. ఈ వీడియోలో ఝాన్సీ "వాబిసాబి ఆర్ట్ ని ఇక్కడ ప్రెజంట్ చేస్తున్న ఫస్ట్ ఆర్టిస్ట్..సుర్కి లోటస్ అండ్ సం గోబర్ లీవ్స్" అంటూ చెప్పింది.

వాబిసాబి అనేది జాపనీస్ ఆర్ట్ స్టైల్. ఇక ఝాన్సీ తన పెరట్లో పెంచుకునే కూరగాయలను వీడియోస్ చేసి తన ఫాన్స్ తో షేర్ చేసుకుంటుంది. అలాగే నాటకాలు కూడా రాస్తూ ఉంటుంది. రీసెంట్ "టిట్ ఫార్ టాట్" అనే నాటకాన్ని రాసి డైరెక్ట్ చేసింది ఝాన్సీ. ఇక ఝాన్సీని నందిని రెడ్డి కూడా పొగిడింది. అంతేకాదు అప్పుడప్పుడు మోటివేషనల్ లైన్స్ కూడా చెప్తూ ఎవరినీ జడ్జ్ చేయకండి..కుదిరితే మంచిగా ఉండండి లేదంటే లేదు అని కూడా కొంచెం ఘాటుగానే చెప్తుంది ఝాన్సీ. ఈమధ్య ఝాన్సీ మూవీస్ లో మంచి కీ రోల్స్ లో నటిస్తోంది. సాలార్, మిస్ పర్ఫెక్ట్ మూవీస్ ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.


Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.