English | Telugu

సెంటిమెంట్ సుబ్బయ్యతో ఆలీ ముచ్చట్లు!

ఆలీతో సరదాగా షోకి ఎంతోమంది లెజెండరీస్ వచ్చి ఎన్నో విషయాలు చెప్పడం ఆడియన్స్ కి కూడా ఈ షో నచ్చడంతో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు తాజాగా ముత్యాల సుబ్బయ్య గారిని షోకి తీసుకొచ్చారు ఆలీ. తెలుగు మూవీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ ప్లేస్ క్రియేట్ చేసుకుని, మంచి గుర్తింపు పొందినప్పటికీ మామూలు మనిషిలా మెలగడం, మాట్లాడటం ఒక్క ముత్యాల సుబ్బయ్య గారికే సొంతం. పెద్దా, చిన్నా తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ‘గురువా’ అంటూ పిలవడం ఆయన సింప్లిసిటీకి నిదర్శనం.

"నా స్కూల్ నుంచి చాలా మంది వచ్చారు. నాది సెంటిమెంట్ స్కూల్. అందుకే చాలామంది నన్ను సెంటిమెంట్ సుబ్బయ్య అనే పేరుతో పిలుస్తారు. ఐతే బోయపాటి శీను స్కూల్ వేరు . ఆయన అన్ని నరకడమే పనిగా పెట్టుకున్నాడు. యాక్షన్ అని నేను చెప్పింది "మూడుముళ్ల బంధం" మూవీ కి . కానీ ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది.

నేను రాజశేఖర్ తో ఎక్కువ సినిమాలు చేసాను. కోడి రామకృష్ణ గారు నాకంటే ఒక సినిమా ఎక్కువ తీశారనుకుంటా ఆయనతో. దాసరి గారు, బాలు గారి మీద పర్వతాలు- పానకాల సినిమా తీసాం, కష్టపడి చేశాంగానీ సినిమా ఆడలేదు.హిట్లర్ సినిమాను మలయాళంలో చూసిన ఎడిటర్ మోహన్ గారు ఫోన్ చేసి నన్ను డైరెక్షన్ చేయమన్నారు. దేవుడా అదృష్టం ఈ రూపంలో వచ్చిందా అనుకుని వెంటనే చిరంజీవి గారిని కలిసాను. అలా ఆ సినిమా తీసాను" అంటూ చెప్పుకొచ్చారు సుబ్బయ్య గారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.