English | Telugu

మేమెప్పటికీ విడిపోము...ఆ రెండు కుర్చీలు ఖాళీ కావడం నిజంగా బాధాకరం  

సిక్స్త్ సెన్స్ సీజన్ 5 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి నటుడు నరేష్, పవిత్ర లోకేష్ వచ్చారు. వీళ్ళ ఇద్దరి రియల్ స్టోరీనే సినిమాగా "మళ్ళీ పెళ్లి" పేరుతో త్వరలో రాబోతోంది. "మీరు ముద్దుగా పవిత్ర లోకేష్ గారిని ఏమని పిలుస్తారు" అని ఓంకార్ అడిగేసరికి "అమ్ములు అని పిలుస్తాను ఇంకా ముద్దొస్తే అమ్ము అంటాను... ఇంకా ముద్దొస్తే..వద్దులే " అని తప్పించుకున్నాడు నరేష్. వీళ్ళతో పాటు ఈ స్టేజి మీద ఆడియన్స్ ని అలరించడానికి "డెడ్ పిక్సల్స్ మూవీ టీమ్ నుంచి నిహారిక కొణిదెల, అక్షయ్, సాయి రోనాక్ వచ్చారు, ఇంకా సేవ్ ది టైగర్స్ మూవీ నుంచి అభినవ్, పావని గంగిరెడ్డి వచ్చారు. కాసేపు సాంగ్స్ , డాన్సేస్ తో ఎంటర్టైన్ చేశారు... కృష్ణ చేసి "జుంబారే " సాంగ్ కి ఆయన్ని ఇమిటేట్ చేస్తూ నరేష్ డాన్స్ చేసాడు.

తర్వాత ఓంకార్ " మీ రిలేషన్ షిప్ స్టేటస్ ఏమిటి" అని అడిగేసరికి "ఆకాశం మీద పడినా, భూమి బద్దలైనా మేమిద్దరం కలిసే ఉంటాం" అని చెప్పాడు నరేష్. "కృష్ణ గారు అంటే మీకు ఎంత ఇష్టం" అని నరేష్ ని అడిగాడు ఓంకార్. "అమ్మ చనిపోయినప్పుడు ఇంకా మమ్మీ అని పిలుచుకునే పిలుపు లేదని అనుకున్నా..అమ్మ కృష్ణ గారు ఇద్దరూ ప్రతీక్షణం కలిసే ఉండేవాళ్ళు. షూటింగ్ ఉన్నా లేకపోయినా కలిసే ఉండేవాళ్లు. అమ్మ పోయాక ఇద్దరి చైర్స్ లో ఒకటి ఖాళీగా కనిపించింది. అప్పుడు నా మనసు చాలా బాధపడేది. ఆయనలో అమ్మను చూసుకునేవాడిని. నేను ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు తన పక్క సీట్ లో అమ్మ ఫోటో పెట్టుకునేవారు. ఆయన ఆమెను ఎంత మిస్ అయ్యారో అప్పుడు తెలిసింది. అంతలోనే ఆయన కూడా సడెన్గా వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోవడం ఆ రెండు చైర్స్ ఖాళీ కావడం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు." అని ఫీలవుతూ చెప్పాడు నరేష్. ఇలా కొంచెం ఫన్నీగా, ఇంకొంచెం ఎమోషనల్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ రాబోతోంది.


Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.