English | Telugu

విశ్వక్ సేన్ బూతులు...ఫీలైపోయిన సుమ

సుమ అడ్డా కామెడీ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి విశ్వక్‌ సేన్‌ నటించిన `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` మూవీ టీమ్‌ సందడి చేసింది. విశ్వక్‌సేన్‌, డైరెక్టర్ కృష్ణచైతన్య, కమెడియన్లు పాల్గొని సందడి చేశారు. ఇందులో విశ్వక్‌ సేన్‌ ఇచ్చిన కౌంటర్స్ కి సుమ షాకైపోయింది. సమ్మర్ కాబట్టి విశ్వక్‌ సేన్‌ చేతికి ముంజకాయ ఇచ్చింది సుమ. అది చూశాక.." ఇదే చెట్టుకు వేరే మెటీరియల్ వస్తుంది కదా" అంటూ కౌంటర్ వేసాడు.

ఇక సుమ కూడా రివర్స్ కౌంటర్ వేద్దామని అనుకుంది. విశ్వక్‌ సేన్‌ ఒరిజినల్‌ మాటలు వినిపించండి అనేసరికి ఆయన నటించిన `ఫలక్‌నుమా దాస్‌` చిత్రంలోని ఊరమాస్‌ డైలాగ్స్ వినిపించారు. వెంటనే విశ్వక్ సేన్ కూడా రోషన్‌ నటించిన `బబుల్‌ గమ్‌` సినిమాలోని చివరి డైలాగ్‌ ఒకసారి వేయండి అనేసరికి అది కూడా బూతు డైలాగ్ కాబట్టి సుమ మౌనంగా తలదించుకుంది. ఆ తర్వాత సుమ "సమయం చాలా విలువైనది" అని అనగానే "వెళ్లి యూజ్‌ చేసుకోనా" అంటూ విశ్వక్‌ మరో పంచ్‌ వేశాడు. "నీకు ఈత వచ్చా మరి" అని సుమ అడగ్గా.. "నాకు ఈతొచ్చు.. తొమ్మిది రకాలుగా కొడతా" అన్నాడు విశ్వక్‌. "తొమ్మిది రకాలా.. ఏ ఒక్క రకం కొడితే సరిపోతుంది కదా" అని అంది సుమా. "నా ఇష్టం ఉన్నట్టు కొడతా" అని చెప్పేసరికి కమెడియన్‌ పమ్మి సాయి "గోదావరి ఈ చివరి నుంచి ఆ చివరికి ఈత కొట్టాడు" అని చెప్పాడు. "ఏంటి గోదావరిలో ఈత కొట్టారా మీరు" అని సుమ అమాయకంగా అడిగింది. "నేను సముద్రం మధ్యలో కూడా బోట్‌ ఆపేసి సడెన్‌గా దూకేస్తా" అని చెప్పడంతో నోరెళ్లబెట్టింది సుమ. "మరి తర్వాత ఎవరు తీసుకొస్తారని అడగ్గానే "నేనే వస్తా ఓ పది నిమిషాలు ఆగి" అని విశ్వక్‌ సేన్‌ చెప్పాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.