English | Telugu

రొమాంటిక్ డాన్స్ చేసిన మానస్-విష్ణుప్రియ!

బుల్లితెర షోస్ మాములుగా ఉండడం లేదు. మంచి జోష్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో కలర్ ఫుల్ గా ముస్తాబై వస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా ‘మంచి రోజులొచ్చాయి’ పేరుతో ఓ ఈవెంట్ బుల్లితెర మీద ప్రసారం కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోల్ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఒక ప్రోమో చూస్తే గనక మంచి హీట్ పుట్టించే డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు విష్ణుప్రియ, మానస్. విష్ణుప్రియ ‘పోరాపోవే’ షోతో యాంకర్ గా మారింది. తర్వాత ‘ వాంటెడ్ పండుగాడ్’ అనే మూవీలో ఓ హీరోయిన్ గా చేసింది.

రీసెంట్ గా ‘జరీ జరీ పంచె కట్టి’ అంటూ బిగ్ బాస్ మానస్ తో కలిసి విష్ణుప్రియ ఓ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ చేసింది. అది సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయింది. దీంతో విష్ణుప్రియ-మానస్ జంటను మెయిన్ కాన్సెప్ట్ గా సెలెక్ట్ చేసుకుని సంక్రాంతి షో ప్లాన్ చేశారు మేకర్స్. వీళ్లకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాక స్టేజి మీదకు విష్ణుప్రియ తరఫు బంధువులు, మానస్ తరఫు బంధువులు రావడం వాళ్ళ పెళ్లి కోసం జరిగే హంగామా మొత్తాన్ని చూపించబోతున్నారు. ఇక వీళ్ళిద్దరూ ‘ఈ వర్షం సాక్షిగా’ అనే పాటకు చేసిన డాన్స్ లో వీళ్ళ కెమిస్ట్రీ అద్భుతంగా పండింది.

ఈ సాంగ్ ఐపోయాక అర్జున్ అంబటి వచ్చి "పెళ్ళికి ముందే ఇంత చేశారు అంటే ఇక పెళ్లి తర్వాత ఎంత చేస్తారో ఊహించుకుంటే ఆ" అని నవ్వుతాడు. తర్వాత అన్నపూర్ణ, సుధా, రజిత వచ్చి "ఆది ఇక నుంచి జబర్దస్త్ కి ఇక నుంచి మేమే టీం లీడర్స్ అని కామెడీగా చెప్పేసరికి "ఇంతకు మీ టీం పేరేంటి" అని ఆది అడిగాడు. "అదరగొట్టే అన్నపూర్ణ, సూపర్ సుధా, రైజింగ్ రజిత" అనే చెప్పేసరికి "అవి అస్సలు మీకు సెట్ కాలేదు..అల్సర్ అన్నపూర్ణ, షుగర్ సుధా, రక్తపోటు రజిత" అనేవైతే సెట్ అవుతాయి అనేసరికి అందరూ నవ్వేశారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.