English | Telugu

శృతి మించిన రోహిణి పెర్ఫార్మెన్స్...ఇబ్బంది పడిన ఆది సాయికుమార్

ఉగాది మాస్ ధమాకా అవార్డ్స్ ఫంక్షన్ కి ఆది సాయికుమార్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఈవెంట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. "చిరునవ్వే విసిరావే" అనే బ్యాక్ గ్రౌండ్ లో సాంగ్ వస్తుంటే ఆది స్టేజి మీదకు మెరిసిపోయే బ్లాక్ డ్రెస్ లో మెస్మోరైజ్ చేసేసాడు. ఫస్ట్ టైం ఆది బుల్లితెర మీద తన డాన్స్ పెర్ఫార్మెన్స్ అందరి మైండ్స్ ని బ్లాంక్ చేసేసాడు. ఆయన వెనకే జబర్దస్త్ లేడీ కమెడియన్ రోహిణి లంగా వోణిలో ఎంట్రీ ఇచ్చేసింది. ఆది ఆమెను చూసి తలపట్టుకున్నాడు పాపం... "నేను ఎక్కడికి వెళ్లినా ఈవిడ వచ్చేస్తారు. ఎందుకో నాకు అర్ధం కావట్లేదు" అని ఆది చాలా ఫీల్ అయ్యాడు. రోహిణి మాత్రం అతని మాటలు పట్టించుకోలేదు తనను కాదు అన్నట్టుగా తన పని తాను చేసుకుపోయింది.

"అస్సలేం గుర్తుకు రాదు" అనే సాంగ్ కి డాన్స్ చేస్తూ తన వోణి పల్లూని ఆది ముఖం మీదకు విసిరి అతన్ని కొట్టి మరీ డాన్స్ చేసింది. ఆది పరిస్థితి అతని ఫేస్ లో కనిపించేసింది... ఐతే రోహిణి పెర్ఫార్మెన్స్ మాత్రం కొంచెం శృతి మించి మరీ చిరాకు తెప్పించేదిగా ఉంది. ఇంతలో శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి "ఇంతకు మీకు ఆమె బికినీలో కావాలా, శారీలో కావాలా" అని ఆదిని అడిగింది. "ఆల్రెడీ సౌందర్య గారు శారీతో చేసేసారు వి విల్ గో విత్ బికినీ" అని యమా స్టైల్ గా చెప్పేసింది రౌడీ రోహిణి. ఆ మాటకు ఆది తలదించుకోక తప్పలేదు. ఇక ఈ షో ఈ ఆదివారం జీ తెలుగులో సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాబోతోంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.