English | Telugu

తేజతో పులిహోర కలిపిన ప్రియమణి...

ప్రియమణి అంటే ఇండస్ట్రీలో ఒక మంచి ఫేమ్ ఉంది. ఆమె ఎన్నో మంచి మంచి మూవీస్ లో గుర్తుండిపోయే రోల్స్ లో నటించింది. దాదాపు 20 పైగా సినిమాల్లో నటించి ఆడియన్స్ ని మెప్పించింది ప్రియమణి. పరుత్తివీరన్ లోని నటనకు 2006 లో జాతీయ ఉత్తమ నటి అవార్డుని అందుకుంది. అలాగే రావణ్ మూవీ ద్వారా హిందీ చిత్రసీమలోకి అడుగు పెట్టింది. ఈ మూవీలో ప్రియమణి నటన వేరే లెవెల్ అని చెప్పొచ్చు. తెలుగులో "ఎవరే అతగాడు" మూవీతో ప్రేక్షకులను పలకరించింది. తర్వాత ఎన్టీఆర్ తో యమదొంగ మూవీలో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇక ఇప్పుడు భామ కలాపం మూవీతో ఆడియన్స్ ని అలరిస్తోంది. ఈ మూవీ సెకండ్ పార్టీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా టేస్టీ తేజతో కలిసి సందడి చేసింది. ఇక తేజ కూడా ఆమెను ఎన్నో ప్రశ్నలు వేసాడు. "ఢీ ఫామిలీలో మిమ్మల్ని మిస్ అవుతున్నాం.. అని ఒక ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు ప్రియమణి ఆన్సర్ ఇచ్చింది. మల్లెమాలఫ్యామిలీ నాకు ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలా అనిపిస్తుంది. నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. నేను చాలామంది మిస్ అవుతున్నానని. ప్రదీప్, సుధీర్, రష్మీ, శేఖర్ మాస్టర్ అందరినీ మిస్ అవుతున్నాను.

నేను ఎక్కడికి వెళ్లినా కూడా మిమ్మల్ని ఢీ షోలో మిస్ అవుతున్నాం అని చెప్తూ ఉంటారు. ఆదితో కామెడీ చాలా వర్కౌట్ అయ్యింది. మీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నేను వాళ్లందరినీ మిస్ అవుతున్నాను.ఫ్యామిలీ మెన్ నెక్స్ట్ సీజన్ ఎప్పుడు అన్న మరో ప్రశ్నకు త్వరలో.. ఈ ఇయర్ స్టార్ట్ చేస్తున్నాం అని ఆన్సర్ ఇచ్చింది. మీరు కంటిన్యూయస్ గా మూవీస్ చేయడం లేదు. మేము మీ మూవీస్ ని మిస్ అవుతున్నాం అని అడిగిన ప్రశ్నకు.. ఈ ఇయర్ చేస్తాను కంటిన్యూయస్ గా మూవీస్ వస్తాయి.. తెలుగులో కాకుండా అన్ని ల్యాంగ్వేజ్స్ లో కూడా. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ మూవీస్ లో నటించాను. ఇక నా డైట్ విషయానికి వస్తే అన్నీ తింటాను కానీ లిమిట్ గా తింటున్నాను" అని చెప్పింది ప్రియమణి. ఇక తేజ ఈమెతో పులిహోర చేయించి తిన్నాడు తినిపించాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.