English | Telugu

తెలుగు మీడియం ఇస్కూల్‌లో సన్నీలియోన్ పాఠాలు!

సన్నీ లియోన్ అంటే చాలు ఆమె చేసిన అన్ని మూవీస్, సాంగ్స్ గుర్తురాకుండా ఉండవు. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, మరాఠీ భాషల్లో నటిస్తోంది సన్నీ. టాలీవుడ్ కి 2014లో 'కరెంటు తీగ' మూవీతో ఎంట్రీ ఇచ్చింది సన్నీ. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమాలో సన్నీ లియోన్ టీచర్ గా నటించింది.

వెండితెర పై టీచర్ గా ఎంట్రీ, బుల్లితెరపై కూడా టీచర్ ఎంట్రీ. ఆ తరువాత మంచు విష్ణు ‘జిన్నా’ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే సీనియర్ హీరో రాజశేఖర్ సినిమా గరుడ వేగాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఇక ఇప్పుడు తెలుగు బుల్లితెర మెడకు అడుగు పెట్టబోతోంది. ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ పై కనిపించి అలరించిన సన్నీ లియోన్.. ఇప్పుడు తెలుగు బుల్లితెర పై కనిపించి ఎంటర్‌టైన్ చేయబోతుంది. జీ తెలుగులో సన్నీ లియోన్ ఒక రియాలిటీ షో చేస్తోంది.

ఆ షోని సన్నీ హోస్ట్ గా ఉండి నడిపించబోతుంది. దీనికి సంబంధించిన ఒక ప్రోమోని రిలీజ్ అయ్యింది. ఇక ఈ రియాలిటీ షోకి ‘తెలుగు మీడియం ఇస్కూల్ ’ అని టైటిల్ ని పెట్టారు. సన్నీ లియోన్ గతంలో బాలీవుడ్ కి సంబంధించిన కొన్ని షోస్ కి హోస్ట్ గా చేసింది. మన తెలుగులో సన్నీ లియోన్ చేస్తున్న మొదటి టెలివిజన్ షో ఇదే. మరి వచ్చి రాని తెలుగుతో సన్నీ లియోన్.. తెలుగు మీడియం ఇస్కూల్ లో ఏమేం పాఠాలు చెప్తుందో చూడాలి. తెలుగు నేర్పడానికి మాష్టర్ గా మనోని కూడా ఏర్పాటు చేశారు. ఈ షోలో సన్నీ లియోన్ తో పాటు టాలీవుడ్ యాంకర్ రవి కనిపించబోతున్నాడు. ఐతే ఇప్పుడు సన్నీ లియోన్ హిందీలో మూడు సినిమాలు, తమిళంలో రెండు సినిమాలు, మలయాళ, కన్నడలో ఒక్కో సినిమా చేస్తుంది. ఉపేంద్ర UI లో కీ రోల్ లో కనిపించబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.