English | Telugu

ట్రెండింగ్ లో శివాజీ.. సీజన్-7 టైటిల్ SPY లో ఒక్కరికేనా!

బిగ్ బాస్ సీజన్-7 లో సీరియల్ బ్యాచ్ ఎంత ఫేమసో.. శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ అంతే ఫేమస్. సీరియల్ బ్యాచ్ వాళ్ళేమో రివేంజ్, స్ట్రాటజీ, గ్రూపిజం అంటు మాట్లాడుకుంటూ కలిసి హౌస్ లో ఉంటే.. శివాజీ, ప్రశాంత్, యావర్ వీళ్ళేమో ఫెయిర్ గా ఆడాలి‌. మనం మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలి. ధర్మంగా ఆడాలని వీళ్ళుంటారు.

బిగ్ బాస్ సీజన్-7 తుది దశకు చేరుకుంది. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కావడంతో శనివారం నాటి ఎపిసోడ్‌లో అశ్వినిశ్రీని ఎలిమినేట్ చేసాడు నాగార్జున. మరి తర్వాతి ఎలిమినేషన్ ఎవరంటు ఇప్పటికే నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటి మద్యలో అమర్ దీప్ గతవారం, ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ రేస్ లో ఫైనల్ దాకా వచ్చి ఓడిపోయాడు. అయితే శుక్రవారం నాటి కెప్టెన్సీ టాస్క్ లో.. అర్జున్ కోసం శివాజీ, అమర్ కోసం శోభాశెట్టి స్టాండ్ తీసుకున్నారు. బిగ్ బాస్ ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోమని చెప్పగా ఇద్దరి మద్య చాలా‌సేపు డిస్కషన్ జరిగింది. దీంతో ఇచ్చిన సమయంలో నిర్ణయం తీసుకోలేదని కెప్టెన్సీ టాస్క్ ని రద్దు చేశాడు బిగ్ బాస్.

అయితే అమర్ దీప్ ఏడ్వడంతో తన ఫ్యాన్స్ శివాజీ వర్సెస్ అమర్ దీప్ లలో ఎవరు కరెక్ట్ అంటూ ట్విట్టర్ లో వీడియోలు పెడుతున్నారు. ఇక దీనిని చూసిన SPY(శివాజీ, ప్రశాంత్,యావర్) ఫ్యాన్స్.. అమర్ దీప్ హౌస్ లోకి వచ్చిన దగ్గర నుండి చేసిన ఫౌల్ గేమ్, వాళ్ళ గ్రూపిజం అన్నీ బయటకు తీస్తూ.. #శివాజీ ది విన్నర్ అంటూ ట్రెండింగ్ క్రియేట్ చేశారు. ఇది కాస్త వైరల్ గా మారింది. శివాజీ, యావర్, ప్రశాంత్ ముగ్గురు కలిసి ఉండే కొన్ని వీడియో క్లిప్స్ ని ఎడిట్ చేస్తున్నారు. SPY ఫ్యాన్స్ శివాజీ, ప్రశాంత్, యావర్ ల బాండింగ్ గురించి అప్లోడ్ చేసిన వీడియోలని చూస్తే ఎవరికైన గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఎమోషనల్ గాను, ఇన్ స్పైరింగ్ గాను చూపిస్తూ వాటికి తగ్గట్టు మ్యూజిక్ ని యాడ్ చేస్తున్నారు. కాగా ఇవి ఫుల్ వైరల్ గా మారాయి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.