English | Telugu

శ్యామా ఇంటి పెరట్లో పాము కుబుసం

పెరట్లో పాము కుబుసం చూసేసరికి వసంత వాళ్లంతా భయపడతారు. శ్యామా, అఖిల్ తో పూజ చేయిస్తామని మొక్కుకుని దాన్ని నెరవేర్చకపోవడం వలన ఇలా జరిగిందా అంటూ వసంత భయపడుతూనే గురువు గారికి చెప్తారు. ఆయన ఇంటికి వచ్చి మొత్తం పరిశీలిస్తారు. వసంత కుటుంబం మొత్తం ఆయన పాదపూజ చేస్తారు. జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి నాడు ఇలా పాము కుబుసం ఇంట్లో కనిపిస్తే కనిష్ట సంతానానికి మంచిది కాదు అని సెలవిస్తారు గురువు గారు. కాలం కలిసి రాకపోతే ప్రాణాలకే ప్రమాదం రావచ్చు అని చెప్తారు. ఈ కుబుసం ప్రభావం తగ్గాలి అంటే శ్యామా వట సావిత్రి వ్రతం చేయాలని సూచిస్తారు. నియమనిష్ఠలతో కటిక ఉపవాసం చేయాలని, బయటికి వెళ్లకూడదని గురువుగారు చెప్పేసరికి అన్ని సరే అని చెప్తుంది శ్యామా. మరో పక్క ఐశ్వర్య శ్యామా వ్రతాన్ని ఎలా చెడగొట్టాలా అంటూ ప్లాన్స్ మీద ప్లాన్స్ వేస్తుంది. ఇంతకు శ్యామా చేసే వ్రతాన్ని ఐశ్వర్య భగ్నం చేస్తుందా ? అనే విషయాన్ని ఈరోజు మధ్యాహ్నం ప్రసారమయ్యే కృష్ణతులసి ఎపిసోడ్ లో చూడొచ్చు.


Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.