English | Telugu

కాంట్రవర్సీ యాంకర్ పై ఫైర్..షో నుంచి లేచి వెళ్లిపోయిన శేఖర్ మాష్టర్!

శేఖర్ మాష్టర్ ఇప్పుడు బుల్లితెర మీద స్టార్ కొరియోగ్రాఫర్...ఆయన రకరకాల ఈవెంట్స్ తో ఫుల్ బిజీ ఐపోయాడు. స్టార్ హీరోల మూవీస్ కి కొరియోగ్రాఫర్‌గా చేస్తూ బుల్లితెర మీద ఢీకి జడ్జిగా చేస్తున్నాడు. అలాంటి శేఖర్ మాష్టర్ ఢీ షో మధ్యలోంచి లేచి వెళ్లిపోయాడు.

ఢీ షో కొత్త సీజన్ మొదలైన విషయం తెలిసిందే. సెలెబ్రిటీ స్పెషల్ వస్తున్న ఈ షోలో ఎంతోమంది సెలెబ్స్ స్టెప్పులేస్తున్నారు. సీరియల్ తారలు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా ఢీ షోలో కనిపించనున్నారు. యాంకర్‌గా నందు వచ్చేశాడు. జడ్జ్‌గా ప్రణీత కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి యాంకర్ శివను తీసుకొచ్చారు ఈ షో మేకర్స్. సెలబ్రెటీల ఇంటర్వ్యూలతో వాళ్ళను అడిగే సిల్లీ క్వశ్చన్స్ తో అతను బాగా ఫేమస్ అయిపోయాడు. ఇక ఇప్పుడు తన పైత్యాన్ని ఈ స్టేజి మీద ప్రదర్శించాడు. " మీకు ఒక హీరోయిన్ కి అఫైర్ ఉందని బయట రూమర్స్ నడుస్తున్నాయి మాష్టర్ ?" అని స్టేజ్ మీదే అందరి ముందే శేఖర్ మాస్టర్‌ను అడిగేసరికి శేఖర్ మాష్టర్ ఫుల్ ఫైర్ ఐపోయి " ఎవడ్రా వీడ్ని తీసుకొచ్చింది.." అని అడిగాడు. "మాష్టర్, మాష్టర్ " అని శివ ఏదో చెప్పబోతున్నంతలో "నోరుమూసుకుని ఉండు..నాకు ఒక ఫామిలీ ఉంది..పిల్లలున్నారు. అతన్ని పంపిస్తారా నన్ను వెళ్ళిపోమంటారా" అని సీరియస్ గా అడిగేసి లేచి స్టేజి మీద నుంచి వెళ్లిపోయారు. ఇలా ప్రోమోను కట్ చేశారు. దీంతో సెట్లోని వారంతా షాక్ అయ్యారు అసలక్కడ ఎం జరుగుతుందో అర్ధం కానీ మరో జడ్జ్ ప్రణతి కూడా షాక్ లో ఉండిపోయింది . మరి ఇక ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే.. డిసెంబర్ 27న ప్రసారం అయ్యే ఎపిసోడ్ ను చూడాల్సిందే.


Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.