English | Telugu

లోన్ యాప్ తో ఇబ్బందులు పడుతున్న ప్రియాంక నాయుడు...జాగ్రత్తగా ఉండండి


"వదినమ్మ" సీరియల్ తో ఫేమ్ తెచ్చుకున్న ప్రియాంక నాయుడు అందరికీ తెలిసిన నటి. ఈ సీరియల్ తర్వాత ఆమె దీపారాధన అనే సీరియల్ తో ఆడియన్స్ కి మరింత దగ్గరయింది. అలాంటి ప్రియాంక ఇప్పుడు కొన్ని ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఐతే కొంతమంది స్కామర్లు కారణంగా ఆమె పడుతున్న బాధను ఒక వీడియోగా చేసి ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. రీసెంట్ గా ఆమె ఒక లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసిందట. బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్లు చెప్పింది. ఐతే తర్వాత అదొక ఫేక్ స్కాం యాప్ అని తెలిసింది. ఆ యాప్ కారణంగా తన ఫోన్ మొత్తం హ్యాక్ అయ్యిందని చెప్పింది. దాంతో ఆ స్కామర్లు తన ఫామిలీ మెంబర్స్ ని, ఫ్రెండ్స్ కి బెదిరింపు కాల్స్ చేస్తున్నారని తనకు ఎంతో భయమేస్తోంది ఆవేదన వ్యక్తం చేసింది.

తన ఫేస్ ని మార్ఫింగ్ చేసి వాటిని అందరికీ పంపిస్తామని బెదిరిస్తున్నారని చెప్పింది. బాగా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అవి ఇవ్వకపోతే తన ఫొటోస్ మొత్తాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని భయపెడుతున్నారని చెప్పింది ప్రియాంక నాయుడు. తన నంబర్ నుంచి ఎలాంటి మెసేజ్ వచ్చినా కానీ వెంటనే రిపోర్ట్ కొట్టాలని సూచించింది. కాబట్టి ఎవరైనా సరే లోన్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకునేటప్పుడు అలెర్ట్ గా ఉండాలని హెచ్చరించింది. ఇక నెటిజన్స్ ఐతే టేక్ కేర్ అక్కా , జాగ్రత్త అంటూ మెసేజెస్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో లోన్ యాప్స్ అనే కాదు రకరకాల యాప్స్ డౌన్ లోడ్ చేసుకుని చాలామంది ఇబ్బందుల్లో పడుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు తీసుకునేంతవరకు కూడా వెళ్తున్నాయి. సోషల్ మీడియాని యాప్స్ కి ఎంతదూరంగా ఉంటె అంత మంచిది అన్న విషయాన్నీ కూడా అందరూ తెలుసుకుంటే కొంత ప్రమాదం నుంచి బయటపడినట్టే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.