English | Telugu

Podarillu: మూడు రోజుల్లో భూషణ్ తో పెళ్లి.. చక్రితో కలిసి మహా ఏం చేయనుంది?

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -17 లో.. చక్రికి మాధవ ఫోన్ చేస్తాడు. ఇంకా ఎంతసేపురా అతన్ని వదిలెయ్యమంటావా అని మాధవ చెప్పగానే చక్రి టైమ్ చూసుకొని సరే వదిలెయ్యండి అని చెప్తాడు.

ఆ తర్వాత మహా దగ్గరికి చక్రి వెళ్తాడు. నువ్వు ఇలాగా కిడ్నాప్ లు చేస్తుంటావా అని అడుగుతుంది. లేదండి మీరు ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నారని చేసాను.. నువ్వు ఇక్కడే ఉంటే మరి కిడ్నాప్ ఎవరు చేశారని మహా అడుగుతుంది. మా ఫ్యామిలీని మొత్తం ఇందులో ఇన్వాల్వ్ చేసానని చక్రి అనగానే అవునా చాలా థాంక్స్ అని మహా చెప్తుంది.

మరొకవైపు భూషణ్ ని రోడ్డుపై వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ప్రతాప్ ఇంటికి వెళ్తాడు భూషణ్. అతడిని చూసి ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరో పెళ్లి ఆపాలని చూస్తున్నట్లనిపిస్తుంది. కరెక్ట్ పెళ్లి టైమ్ కి తీసుకొని పెళ్లి టైమ్ అవ్వగానే వదిలేసారని భూషణ్ చెప్తాడు.

ఆ తర్వాత చక్రికి మహా భోజనం తీసుకొని వచ్చి ఇస్తుంది. చక్రి భోజనం చేస్తుంటే మహా తన ఫ్యామిలీ గురించి అడిగి తెలుసుకుంటుంది. లోపల భూషణ్ వచ్చిన విషయం వాళ్లిద్దరికి తెలియదు.

ఎవరో పెళ్లి ఆపాలని చూస్తున్నారని అంటున్నావ్ కదా.. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం ఎందుకు పెళ్లి మూడు రోజుల్లో జరిపిద్దామని ప్రతాప్ చెప్పగానే అందరు సరే అనుకుంటారు.

మరొకవైపు చక్రి తన ఫ్యామిలీ గురించి మహాకి గొప్పగా చెప్తాడు. మహా లోపలికి వెళ్తుంటే భూషణ్ బయటకు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.