English | Telugu

సర్కార్ సీజన్ 3 లో "న్యూసెన్స్" చేసిన టీం..

సర్కార్ సీజన్ 3 లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి "న్యూసెన్స్" మూవీ టీం ప్రొమోషన్స్ లో భాగంగా నవదీప్, బిందుమాధవి వచ్చారు. వాళ్ళతో పాటు టీవీ 9 న్యూస్ రీడర్స్ ప్రత్యూష, సత్య కూడా వచ్చారు. ఈమధ్య టీవీ చానెల్స్ నుంచి న్యూస్ రీడర్స్ కూడా షోస్ కి, ఈవెంట్స్ కి వచ్చే సంస్కృతి నెమ్మదిగా మొదలయ్యింది. వాళ్ళు కూడా ఆడియన్స్ కి బాగా తెలిసిన ముఖాలు కావడం వాళ్లకు ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉండడంతో షో మేకర్స్ కూడా వాళ్ళను బాగా హైలైట్ చేస్తున్నారు.

ఇక ఈ షోలోకి నవదీప్ ఎంట్రీ ఇస్తూనే "సర్కార్ సోలో ఓటిటికి పవన్ కళ్యాణ్ నేను అని ఫీలవుతూ పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ పెట్టుకున్న ప్రదీప్" అని నవదీప్ అనడంతో అతని భుజం మీద చెయ్యేసాడు. వెంటనే "మీడియా మీద చెయ్యేసి ప్రదీప్" అని అన్నాడు. "నోనో మీరు అలాంటివి అనకండి" అని నోరు మూసేసరికి "మీడియా నోరు నొక్కేస్తున్న ప్రదీప్" అంటూ ఫుల్ రేంజ్ లో డైలాగ్ చెప్పారు నవదీప్, బిందు.

తర్వాత సత్య, ప్రత్యూష స్టేజి మీదకు వచ్చారు. "డిం లైట్స్, జనాలు, నవదీప్ అంటే మనం ఇక్కడి నుంచి స్పాట్ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందేమో అని డౌట్ గా ఉంది సత్య" అంది ప్రత్యూష. ఈ నలుగురు వాళ్ళ వాళ్ళ సీట్స్ లో కూర్చున్నాక "ఆరు తర్వాత రెండురా మా ప్రదీపన్న తీస్తాడు బెండురా" అంటూ కామెడీ చేసాడు నవదీప్. బింధుమాధవిని ఒక ప్రశ్న వేసాడు ప్రదీప్ "రామాయణాన్ని ఏ పేర్లతో విభజించారు అవి ఏమిటి" అనేసరికి బిందుమాధవి కళ్ళు ఎర్రగా ఐపోయాయి. "తన కళ్ళల్లో చంద్రముఖి కనిపిస్తోంది" అంది ప్రత్యూష...ఇలా ఈ రాబోయే వారం సర్కార్ ఎపిసోడ్ పంచ్ డైలాగ్స్ తో న్యూసెన్స్ క్రియేట్ చేయబోతోంది. లాస్ట్ ఎపిసోడ్ లో అల్లరి నరేష్ విజేతగా నిలవగా ఈ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూడాలి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.