English | Telugu

కృష్ణ ముకుంద మురారీలో కొత్త ట్విస్ట్.. కృష్ణకి నిజం తెలిసిపోతుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -261 లో.. ఆదర్శ్ ని ఎలాగైనా ఇంటికి తీసుకొని వస్తానని భవానికి మురారి మాటిస్తాడు. మరొకవైపు కృష్ణ కోసం మురారి ఇల్లంతా వెతుకుతుంటాడు. ఎంత వెతికినా ఎక్కడ చూసిన కృష్ణ కన్పించదు. రేవతి చూసి వచ్చి కూడ కృష్ణ లేదని చెప్తుంది.

ఆ తర్వాత అలేఖ్య వచ్చి కృష్ణ, ముకుంద ఇద్దరు బయటకు వెళ్లారని చెప్తుంది. ఆ తర్వాత మురారి ఫోన్ చేస్తానని చెప్పి కృష్ణ కు ఫోన్ చేస్తాడు. తన ఫోన్ స్విచాఫ్ అని వస్తుంది. కృష్ణకి ముకుంద నిజం చెప్తుందేమోనని మురారీతో రేవతి అంటుంది. నీకేమైనా తెలుసా అని అలేఖ్యని రేవతి అడుగుతుంది. నాకేం తెలియదని అలేఖ్య కవర్ చేస్తుంది. ఆ తర్వాత అలేఖ్య మధు దగ్గరకి వెళ్లి మాట్లాడుతుంది. మరొక వైపు ముకుంద, కృష్ణ ఇద్దరు ఒక దగ్గరకి వెళ్తారు. ఏంటి ముకుంద చెప్పు టాప్ సీక్రెట్ అంటూ.. నా ఫోన్ కూడా స్విచాఫ్ చేసావేంటని ముకుందని కృష్ణ అడుగుతుంది. నువ్వు మురారి ప్రేమించిన అమ్మాయి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నావు కదా అని అనగానే.. అవును నీకు తెలుసా అని కృష్ణ అడుగుతుంది. తెలియడం కాదు నా క్లోజ్ ఫ్రెండ్ అని ముకుంద చెప్పగానే.. ఎక్కడ ఉంటుంది‌. పెళ్లి అయిందా? ఇంకా తను ఏసీపీ సర్ నే ప్రేమిస్తుందా అంటూ కృష్ణ ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. రాధకి పెళ్లి అయింది కానీ ఇంకా మురారీనే ప్రేమిస్తుందని, " నీ ప్రేమ కంటే కూడా రాధ ప్రేమ గొప్పది. తన ప్రేమించిన వాడిని త్యాగం చేసింది" అని తన గురించి తానే గొప్పగా కృష్ణతో ముకుంద చెప్తుంది. తనకంటే నా ప్రేమ గొప్పది. ఎవరి కోసమో తను ప్రేమించిన వాడిని వదులుకుంటే గొప్ప ప్రేమ ఎలా అవుతుంది. మురారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని కృష్ణ అంటుంది.

ఆ తర్వాత రాధ చాలా బాధపడుతుంది. మురారి కోసం, రాధ కోసం అయిన నీ ప్రేమని త్యాగం చేయ్ కృష్ణ అని ముకుంద అనగానే.. నువ్వు ఇంకొకసారి అలా అనకు మురారిని వదులుకునేది లేదు. మీ ఫ్రెండ్ రాధకి చెప్పు ఇంకొకసారి ఇలాంటి ఆలోచనని, ప్రపోజల్ ని తీసుకొని రావొద్దని నీక్కూడా చెప్తున్నాను‌. ఇంకొకసారి ఇలా మాట్లాడకు ముకుంద అని కృష్ణ గట్టిగనే వార్నింగ్ ఇస్తుంది. ముకుంద సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.