English | Telugu

Krishna Mukunda Murari : తనది ఆత్మహత్య కాదు హత్య.. ముకుంద చనిపోయిందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -418 లో..ఆదర్శ్ డ్రింక్ చేసి ముకుంద, మురారిలున్న ఫోటోని కాల్చేస్తాడు. అప్పుడే రేవతి మధులు వచ్చి ఆపుతారు. వాళ్ళు చూడు ఎలా చూసి నవ్వుతున్నారో చూడని రేవతితో ఆదర్శ్ చెప్తాడు‌. అక్కడ ఎవరు లేరని రేవతి చెప్తుంది.

ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు ముకుంద గురించి వెతికి వెతికి ఇంటికి వస్తారు. ముకుంద ఏమైనా వచ్చిందా అని మురారి ఇంట్లో వాళ్ళని అడుగుతాడు. రాలేదని చెప్తారు. అప్పుడే మధు హడావిడిగా వచ్చి న్యూస్ పెడతాడు. అందులో ముప్పై సంవత్సరాల యువతి ట్రైన్ కి ఎదరుగా వెళ్లి ఆత్మహత్య చేసుకుందని చెప్పగానే.. అది ముకుందనే అంటు రేవతి ఏడుస్తుంది. ముకుంద అయి ఉండదని మురారి అంటాడు. ఈ విషయం ఆదర్శ్ కి చెప్పొద్దని అనగానే అని ఆదర్శ్ వచ్చి.. నా భార్య చనిపోయిందన్న నిజం కూడా దాచాలని అనుకుంటున్నావా.. నా భార్య చావుకి నువ్వే కారణం ఒప్పుకో కృష్ణ అని ఆదర్శ్ అంటాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ముందు అది ముకుంద నో కాదో వెళ్లి చూడాలి అనుకుని అందరు హాస్పిటల్ కి బయలుదేర్తారు. ఆ తర్వాత ముకుంద చనిపోయిందని ముకుంద వాళ్ళ నాన్న దేవ్ కి ఫోన్ చేసి చెప్పి రమ్మని చెప్తాడు. అప్పుడే మురారి, ఆదర్శ్ వాళ్ళు హాస్పిటల్ లో శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళగానే ముకుంద ఇక లేదని చెప్తాడు. అది విని అందరు షాక్ అవుతారు.

ఆ తర్వాత మీ వల్లే నా కూతురు చనిపోయింది.. నా కూతురిది ఆత్మహత్య కాదు హత్య. ఇదంతా నీ వల్లే నా కూతురిని అర్థం చేసుకొని ఉండుంటే ఇక్కడ వరకు వచ్చేది కాదని మురారిపై శ్రీనివాస్ కోప్పడతాడు. మీరు ఇక్కడ నుండి వెళ్లిపోండి అని శ్రీనివాస్ చెప్తాడు. ఆ తర్వాత అందరు ఇంటికి వచ్చి ముకంద గురించి బాధపడతారు.. మరొకవైపు శ్రీనివాస్ తన ఇంటికి వెళ్తాడు. అక్కడ వెళ్లేసరికి ముకుంద ఉంటుంది. తనని చూసి శ్రీనివాస్ షాక్ అవుతాడు. తరువాయి భాగంలో మమ్మల్ని పంపించేసి నీ భర్తతో నువు హ్యాపీగా ఉండడానికే ప్లాన్ చేసావ్ కదా అని కృష్ణతో ఆదర్శ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.