English | Telugu

Krishna Mukunda Murari:కృష్ణలో‌ మొదలైన అనుమానం.. శోభనానికి ముహుర్తం ఆ ఒక్కజంటకే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కృష్ణ ముకుంద మురారీ '. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్- 400 లో.. కృష్ణ, ముకుంద‌, మురారి , అదర్శ్ కలిసి రెసాట్ నుండి కార్ లో‌ ఇంటికి బయల్దేరుతారు. అయితే దారిలో వస్తుండగా కృష్ణ మనసులో అనుమానం మొదలవుతుంది.

ఇక కారులో వెనుకాల సీటులో కూర్చున్న ముకుంద, ఆదర్శ్ లని చూసిన కృష్ణ.. అలా దూరమెందుకు కూర్చున్నావ్ ముకుంద.. అదర్ అదర్శ్ దగ్గరగా కూర్చోమని అంటుంది. నాకు ఇలాగే కంఫర్ట్ ఉందని ముకుంద అంటుంది. లేదు భార్యెప్పుడు భర్తకి దగ్గరగా ఉండాలని కృష్ణ అంటుంది. తనకి కంఫర్ట్ గా‌ ఉందంట కదా వదిలెయ్ అని మురారి అంటాడు.కంఫర్ట్ కాదు దానికన్నా జాగ్రత్త ముఖ్యమని, అది భర్తనే చూసుకోగలడని కృష్ణ అంటుంది. ఇక తప్పేలా లేదని ఆదర్శ్ దగ్గరగా జరిగి కూర్చుంటుంది ముకుంద. ఇక తపవాల్చి కూర్చోమని కృష్ణ‌ అంటుంది. అయ్యో నిజం చెప్పేదాకా నాకు ఇది తప్పేలా లేదని ముకుంద అనుకుంటుంది. ఇక కృష్ణ బలవంతంతో ఆదర్శ్ భుజం మీద తలవాల్చి కూర్చుంటుంది. ఆ తర్వాత ముకుంద కావాలనే నటిస్తుందనే అనుమానంతో కృష్ణ ఉంటుంది‌. అందరు ఇంటికొచ్చాక ఏం అయిందని అడుగుతుంది. ‌ముకుంద కాలు బెణికిందని కృష్ణ అంటుంది. అది చూసి రేవతి ఫీల్ అవుతుంది. మధుకి మాత్రం డౌట్ అలాగే ఉంటుంది. ముకుంద, ఆదర్శ్ కి దూరంగా ఉందా.. దగ్గరగా ఉందా అని మధు అడుగగా.. ముకుందకి అలా గాయం జరిగితే ఇప్పుడు అవన్నీ అవసరమా అని మురారి అంటాడు. ఆ తర్వాత కృష్ణ యాక్ట్ చేస్తుంది.

ఇక అదంతా చూసి నిజమేమోనని రేవతి వాళ్ళు అలసిపోయారేమోనని ఫ్రెషప్ అయి రమ్మంటుంది. మరోవైపు కృష్ణ మనసులో ముకుంద ఇప్పటివరకు చేసినవన్నీ గుర్తుచేసుకుంటూ తను యాక్ట్ చేస్తుందని రియలైజ్ అవుతుంది. అప్పుడే మురారి వచ్చి ఎందుకు ఇంత సీరియస్ గా ఆలోచిస్తున్నావని కృష్ణని అడుగుతాడు. అదేం లేదని చెప్పి, అదర్శ్, ముకుందలని ఒక్కటి చెయ్యాలని కృష్ణ అనగానే.. ఒక్కటికాకపోతే అదర్శ్ కాశ్మీర్ నుండి ఎందుకు వస్తాడని మురారి అంటాడు. తరువాయి భాగంలో పంతులిని పిలిపించి శోభనానికి ముహుర్తాలు చూడమని చెప్తుంది కృష్ణ. అయితే ఒక్క జంటకి మాత్రమే శోభనానికి ముహుర్తం చూడాలని, అది అదర్శ్, ముకుందలకే ఉందని చెప్పాలని పంతులిని రిక్వెస్ట్ చేస్తుంది కృష్ణ. మంచి జరుగుతుందంటే చేస్తానని పంతులు చెప్పి అదే చెప్తాడు. ఇక ముకుంద షాక్ అవుతుంది. మిగతా వాళ్ళంతా సంతోషపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.