English | Telugu

ఎంత ఖర్చైనా నేనే భరిస్తా..పంచ్ ప్రసాద్ కి కిర్రాక్ ఆర్పీ ఆర్థిక సాయం!

కిర్రాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఐతే ఇప్పుడు అదే ఆర్పీ తన తోటి కమెడియన్ కి సాయం చేస్తానంటూ ముందుకొచ్చాడు. "అతనికి ఎంత ఖర్చైనా పర్లేదు ఆపరేషన్ ఖర్చులు భరిస్తాను. అతని ఇంటి అద్దెతో సహా అన్ని ఖర్చులను నేనే పెట్టుకుంటానని హామీ ఇచ్చాడు. దీనికి సంబంధించి ఫస్ట్ చెక్ ను వచ్చే నెలలో పంచ్ ప్రసాద్ కి ఇస్తానని" ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దీన్ని నేను పేరు కోసం చేయడం లేదన్నాడు. ప్రసాద్ వ్యక్తిత్వం నాకు బాగా తెలుసు అన్నాడు.

రీసెంట్ గా వాళ్ళ ఇంటికి చేపల పులుసు తీసుకుని వెళ్లి పలకరించి వచ్చినట్లు చెప్పాడు. బయటికి కనిపిస్తున్నంత హ్యాపీగా లేడు అని బాధపడ్డాడు. మణికొండలో త్వరలో తన చేపల పులుసు బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నట్లు చెప్పాడు. ప్రసాద్‌కి ఆస్తులేం లేవు.. అన్నీ అప్పులే ఉన్నాయి. కాబట్టి.. పంచ్ ప్రసాద్ కిడ్నీ ఆపరేషన్‌కి అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని చెప్పాడు. వచ్చే నెల నుంచి పంచ్ ప్రసాద్ పూర్తి బాధ్యతల్ని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు తరపున తానూ, సత్తన్నా తీసుకుంటున్నాం అంటూ పెద్ద మనసును చాటుకున్నాడు. దేవుడి దయవల్ల బిజినెస్ బాగుంటే ఎవరికో సాయం చేసేకంటే.. ముందు మన అనుకున్న వాడికి సాయం చేస్తే బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. "మణికొండలో నెక్స్ట్ మంత్ బ్రాంచ్ స్టార్ట్ చేసి అదే రోజు పంచ్ ప్రసాద్ కి ఫస్ట్ చెక్ ఇస్తాను.

ఆ తరువాత కిడ్నీ ఆపరేషన్ ఎంత ఖర్చు అవుతుందో అంతా మేమే భరిస్తాం. దేవుడి దయతో వాడు కోలుకుంటే అంతే చాలు అన్నాడు. ఇద్దరు పిల్లలతో ఇంటద్దె కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నాడు. పది లక్షలైనా.. 15 లక్షలైనా నూటికి నూరు శాతం ఇచ్చిన మాట తప్పను" అన్నాడు కిర్రాక్ ఆర్పీ. కూకట్‌పల్లిలో స్టార్ట్ చేసిన ఫస్ట్ బ్రాంచి కొన్ని రోజులు మూసేసాడు ఆర్పీ. గ్రౌండ్ లెవెల్ లో అన్ని సమస్యల్ని పరిష్కరించుకుని మళ్ళీ వారంలోనే కర్రీ పాయింట్ ని స్టార్ట్ చేసాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.