English | Telugu

'నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు' రీఓపెన్ చేసిన కిర్రాక్ ఆర్పీ


ఒకప్పుడు జబర్దస్త్ కామెడీ షోతో ఫేమస్ ఐన కిర్రాక్ ఆర్పీ ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో మరో పేరు తెచ్చుకున్నాడు. కొంత కాలం క్రితం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసి ఓన్ బిజినెస్ చేసుకోవడం స్టార్ట్ చేసాడు. కర్రీ పాయింట్ పెట్టిన వెంటనే దానికి వచ్చిన రెస్పాన్స్ చూసే అతనే నోరెళ్లబెట్టాడు. జనాల తాకిడికి కాస్త బ్రేక్ ఇస్తూ షాప్ ని కొన్ని రోజుల పాటు మూసేసాడు.

ఐతే షాప్ పెట్టిన వెంటనే క్లోజ్ చేసేసరికి అంతా ఐపోయిందని అనుకున్నారు కానీ ఆ రూమర్స్ మీద ఆర్పీ క్లారిటీ ఇచ్చాడు. వస్తున్న జనానికి తగ్గట్టు సరిగా సప్లై చేయలేకపోతున్నామని ఇంకా కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాను అని చెప్పాడు. అలా నెల్లూరు వెళ్లి అక్కడ సూపర్ గా చేపల పులుసు వండే ఆడవాళ్లను వెదకడం స్టార్ట్ చేసాడు. దానికి ఆడిషన్స్ కూడా పెట్టాడు. అందులో కొంతమందిని ఎంపిక చేసినట్లు చెప్పాడు. వాళ్ళను హైదరాబాద్ కి తీసుకెళ్లి అక్కడ సకల సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చాడు.

ఇంక నెల్లూరు చేపల పులుసు షాప్ ప్రారంభించి నెల రోజులు అయిన సందర్భంగా కిరాక్ ఆర్పీ మళ్ళీ షాప్ ఓపెన్ చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. షాప్ తిరిగి ఓపెన్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. పండుగ సందర్భంగా మాత్రం తమ కర్రీ పాయింట్ క్లోజ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. సంక్రాంతి తర్వాతి నుంచి రోజూ నెల్లూరు చేపల పులుసు అందిస్తామని చెప్పుకొచ్చాడు. కొత్త స్టాఫ్ ని పనిలోకి తీసుకున్నట్లు దానికి సంబంధించిన సప్లై కూడా పెంచనున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. తనకు నచ్చిన పని వదిలి ఎక్కడకీ వెళ్ళేది లేడు అన్నాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.