English | Telugu

'నీ వాయిస్ అంటేనే చిరాకు, నీ షాడో అన్న నాకు అసహ్యం' అంటోన్న కీర్తి భట్!

బిగ్ బాస్ నామినేషన్ అంటేనే కంటెస్టెంట్స్ మధ్యలో మాటల యుద్ధం. ఒక్కో కంటెస్టెంట్ చెప్పే కారణాలు, వాళ్ళు అవతలి కంటెస్టెంట్ ని నామినేషన్ చేసే విధానాలు అందరిని ఆకట్టుకుంటాయి. కీర్తి భట్, రేవంత్ కి మధ్య మాటలు మితిమీరిపోయాయి. కీర్తి భట్, రేవంత్ ని నామినేట్ చేసింది.

నామినేట్ చేసాక కీర్తిభట్ మాట్లాడుతూ, "అన్న, నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం వాయిస్ ఎక్కువగా చేసి మట్లాడుతావ్. అది నేను తీసుకోలేకపోతున్నాను. ఇదే విషయం చెప్పినా నువ్వు వినట్లేదు. నాకు నచ్చలేదు నువ్వు అలా మాట్లాడటం" అని రేవంత్ తో కీర్తి భట్ చెప్పింది. ఆ తర్వాత రేవంత్ మాట్లాడుతూ, "నా వాయిస్ ఏ అంత. ఎవరో నా మీద నామినేషన్ వేసారు అని నువ్వు నన్ను నామినేట్ చేస్తా అంటే కుదరదు. తుప్పాస్ రీజన్స్ కి నామినేట్ చేయడం ఏంటి" అని రేవంత్ అన్నాడు.

"ఒకరు ఏమైనా చెప్పినప్పుడు వినాలి ముందు. కానీ అది నువ్వు పాటించవు. అందరికి రూల్స్ చెప్తావు. కానీ నువ్వు ఫాలో అవ్వవు. నాకు అందుకే నీ వాయిస్ అంటే అసహ్యం. నీ షాడో తగిలిన చిరాకు" అంటు రేవంత్ తో కీర్తి భట్ చెప్పుకొచ్చింది. దానికి సమాధానంగా, " ప్రతీసారీ నామినేషన్లో నీతో పడలేకపోతున్నా, ఏం తెలియకుండా నామినేట్ చేస్తావ్. ఒక ఆలోచన లేదు. థింకింగ్ లేదు. నీతో మాట్లాడటం అంటేనే చిరాకు. అసహ్యం" అని రేవంత్ చెప్పాడు. "నా మాట గురించి నువ్వు చెప్పకర్లేదు. ఐ నో వెరీ వెల్ ఎబోట్ ఇట్" అని కీర్తి భట్ అనగా, "అసలు నువ్వు నా గురించి మాట్లాడక్కర్లేదు" అని రేవంత్ కోపంగా వెళ్ళిపోయాడు. అలా రేవంత్ కి , కీర్తి భట్ కి మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగింది.

అయితే ప్రతీ వారం నామినేషన్లో ఉంటు వస్తోన్న రేవంత్. ఈ సారి కూడా సేవ్ అవుతాడు అని ప్రేక్షకులు భావిస్తోన్నారు. అయితే కీర్తి భట్ కి మాత్రం ఈ వారం ఎలిమినేషన్ తప్పేలా లేదు అనిపిస్తోంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.