English | Telugu

దేవుడు నాకు కనిపిస్తే మా నాన్న కావాలని అడుగుతాను

కీర్తి భట్ బుల్లి తెర మీద ఫేమస్ ఐన నటి. "మనసిచ్చి చూడు" సీరియల్ లో హీరోయిన్ గా, "కార్తీక దీపం" సీరియల్ లో హిమగా ఫేమస్ అయిన కీర్తి భట్ జీవితంలో ఎంతో విషాదం ఉంది. ఇప్పుడు కీర్తి బిగ్ బాస్ సీజన్ 6 హౌస్ లోకి "గాంధారీ గాంధారీ" అనే సాంగ్‌కు స్టెప్పులేస్తూ ఫస్ట్ కంటెస్టెంట్ గా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఐతే హౌస్ లోకి వెళ్లకుముందు ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

"ఒకరోజు ధర్మస్థలికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వస్తున్నాం. ఐతే మా నాన్న దేవుడి ప్రసాదాన్ని దారిలో ఉన్న తన ఫ్రెండ్ కి ఇచ్చేసి వెళ్ళిపోదాం అన్నాడు.. అలా ప్రసాదం ఇచ్చి రిటర్న్ అవుతున్న టైంలో జరిగిన ఆక్సిడెంట్ తో నా జీవితం అంతా తల్లకిందులైపోయింది. నేను 32 రోజులు కోమాలో ఉన్నా. తర్వాత తెలిసిన అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నా. నాన్న ఉన్నప్పుడు అన్నీ ఆయనే నాకు. అమ్మతో అంత బాండింగ్ లేదు నేనెప్పుడూ అమ్మ అని కూడా పిలిచేదాన్ని కాదు పేరు పెట్టి పిలిచేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఒక బిడ్డను దత్తత తీసుకున్నాక తెలిసింది అమ్మ విలువ. ఎన్ని రోజులు ఏడ్చానో లెక్కేలేదు. నాకు దేవుడు కనిపిస్తే మా నాన్న కావాలని అడుగుతాను...మా నాన్న కనిపిస్తే నన్ను ఎందుకు వదిలేసి వెళ్లిపోయావని అడుగుతాను" అంటూ ఎమోషనల్ అయ్యింది కీర్తి.

"ఒక రోజు ఫ్రెండ్స్ తో కలిసి పార్టీకి వెళ్ళాను. ఐతే అక్కడ అందరు డ్రగ్స్ తీసుకుంటున్నారు. నాకు తెలీదు. అప్పుడు నాన్న ఫోన్ చేసేసరికి చెప్పాను లొకేషన్ షేర్ చేయమన్నారు వెంటనే వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్లారు. అలాగే ఫ్రెండ్స్ అందరిని రెండో రోజు ఇంటికి రమ్మన్నారు. నన్ను కొడతారనుకున్న..కానీ ఒక్కమాట కూడా అనలేదు. అందరూ వచ్చాక ఎవరి మీద అరవలేదు, కోప్పడలేదు..మీ పేరెంట్స్ అంతా మీ మీద ఆశలు పెట్టుకుని ఉంటారు. వాళ్ళను ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకునే పనులు చేయొద్దని చెప్పారు. బతికినంతకాలం నీ మీద ఎలాంటి బ్లాక్ మార్క్ ఉండకూడదు...ఎవరూ వేలెత్తి చూపించకూడదు అని చెప్పారు.. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నాన్న మాటకు కట్టుబడి ఉన్నాను." అంటూ చెప్పింది కీర్తి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.