English | Telugu

Karthika Deepam2 : దాస్ పై శివన్నారాయణకి డౌట్.. జ్యోత్స్న తీసుకున్న నిర్ణయం ఏంటంటే! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -484 లో.....శివన్నారాయణ, పారిజాతం ఇద్దరిని కార్తీక్ గుడికి తీసుకొని వెళ్లి రిటర్న్ అవుతాడు. మీ నాన్న ఇంట్లో దాస్ ఉన్నాడట అక్కడ ఆపమని కార్తీక్ తో పారిజాతం చెప్తుంది. ఏంటి మీ గుసగుసలు అని శివన్నారాయణ అడుగుతాడు. ఏం లేదు వాళ్ళ కొడుకు ఊరు నుండి వచ్చాడట ఒకసారి శ్రీధర్ ఇంటి దగ్గర ఆపమని అంటుందని కార్తీక్ చెప్తాడు.

ఆ మాత్రం దానికి గుసగుసలు ఎందుకు మాములుగా మాట్లాడుకోవచ్చు కదా శ్రీధర్ ఇంటిదగ్గర ఆపు అని కార్తీక్ కి శివన్నారాయణ చెప్తాడు. కార్తీక్ సడన్ గా కార్ ఆపుతాడు. ఇంకా శ్రీధర్ ఇల్లు రాలేదు కదా అని శివన్నారాయణ అంటాడు. ముందు చూడండి దాస్ మావయ్య జ్యోత్స్న మాట్లాడుకుంటున్నారని కార్తీక్ చూపిస్తాడు. దాస్ ని రిక్వెస్ట్ చేస్తూ దాస్ చెయ్ తన తలపై పెట్టుకొని ఒట్టేస్తుంది జ్యోత్స్న. ఇక్కడ ఏం జరుగుతుందని శివన్నారాయణ వెళ్లి అడుగుతాడు. దాస్ దగ్గర ఏం మాట తీసుకున్నావని శివన్నారాయణ అడుగుతాడు. జ్యోత్స్న టెన్షన్ పడుతుంది.ఏం లేదు సర్ కాశీకి సంబంధించి ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి లేదంటే నా మీద ఒట్టే అంటుందని దాస్ కవర్ చేస్తాడు. అందరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కార్తీక్ ఇంటికి వెళ్లి దాస్, జ్యోత్స్న మాట్లాడుకున్నది చెప్తాడు. కాసేపటి తర్వాత కార్తీక్, దీప ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటారు. ఒకరికొకరు నుదుటిపై ముద్దు పెట్టుకుంటారు.

మరుసటి రోజు దాస్ తో జ్యోత్స్న మాట్లాడడం గురించి దశరథ్ తో శివన్నారాయణ చెప్తాడు. అసలు దాస్ నాకు అబద్ధం చెప్పాడనిపిస్తుందని శివన్నారాయణ అంటాడు. దాంతో దాస్ ని జ్యోత్స్న కొట్టిన విషయం గుర్తుచేసుకుంటాడు దశరథ్. ఆ తర్వాత పారిజాతం, జ్యోత్స్న పక్కకి వెళ్లి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత బోర్డు మీటింగ్ లో రెస్టారెంట్ లాభాల కోసం నేనొక నిర్ణయం తీసుకున్నానని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.