English | Telugu

Karthika Deepam2 : సుమిత్రపై దశరథ్ ఫైర్.. దీపని గెంటేశారుగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -454 లో.... శివన్నారాయణతో కార్తీక్ బయటకు వస్తాడు. కార్ ఆపమని కార్తీక్ తో శివన్నారాయణ చెప్తాడు. కార్ దిగి జరిగిన దానికి మీ అమ్మ ఏమంటుందని శివన్నారాయణ అడుగుతాడు. నేను చెప్తే మీరు నమ్మరని కాంచనకి కార్తీక్ ఫోన్ చేస్తాడు. జరిగింది మర్చిపోయావా అని స్పీకర్ లో పెట్టి మాట్లాడతాడు.

మర్చిపోయేంత చిన్న విషయం కాదు అది.. దీని అంతటికి కారణం మా నాన్న.. ఆయన ముందు చేసిన తప్పుల వల్లే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. జ్యోత్స్న మాటలు వింటున్నాడు. నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ ఇంట్లో నుండి బయటపడు.. అది ఇల్లు కాదు నాగుపాము పడగే.. ఆ ఇంట్లో మా అన్నయ్యని తప్ప నేను ఎవరిని నమ్మలేనని కాంచన అంటుంటే శివన్నారాయణ బాధపడతాడు. ఆ తర్వాత శ్రీధర్ దగ్గరికి దాస్ వస్తాడు. నేను శ్రీశైలం వెళ్తున్నాను చెల్లి ముడుపు ఇస్తానంటే వచ్చానని శ్రీధర్ తో దాస్ అంటాడు. కావేరి ముడుపు తీసుకొని వచ్చి దాస్ కి ఇస్తుంది. ఎందుకు ముడుపు అని కావేరీని అడుగుతాడు శ్రీధర్. శౌర్యకి తమ్ముడు రావాలని అని కావేరి అనగానే శ్రీధర్ షాక్ అవుతాడు. ఆ కార్తీక్, దీపలకి గనుక కొడుకు పుడితే దీప ప్లేస్ పర్మినెంట్ అవుతుంది.. అలా అవ్వకూడదని శ్రీధర్ అనుకుంటాడు. మరొకవైపు కాంచన కుటుంబానికి సారీ చెప్పమని సుమిత్రతో దశరథ్ అంటాడు. మమ్మీ చెప్పదని జ్యోత్స్న అంటుంది.

అయితే నా మాట కూడా విను.. నువ్వు కాంచన కుటుంబానికి సారీ చెప్పేవరకు నేను నిన్ను క్షమించలేనని.. నీతో మాట్లాడనని సుమిత్రతో దశరథ్ అంటాడు. మమ్మీ తప్పేముంది.. అంత పెద్ద శిక్ష వేస్తున్నావని జ్యోత్స్న అంటుంది. అదంతా దీప విని బాధపడుతుంది. దీనికి కారణం నువ్వే కదా అని దీపని జ్యోత్స్న లాక్కొని వెళ్లి బయటకు గెంటేస్తుంది. ఎప్పుడు నా భర్త ఇలా మాట్లాడలేదు.. నీ వల్లే ఇదంతా అని దీపపై సుమిత్ర కోప్పడుతుంది. మళ్ళీ దీపని గుమ్మం దగ్గర నుండి గెంటేయ్యబోతుంటే కార్తీక్ వచ్చి పట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.