English | Telugu

Karthika Deepam2 : ఆ విషయం చెప్పేసిన శౌర్య.. షాక్ లో పారిజాతం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '.ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -47 లో.... జ్యోత్స్న ఆలోచనలో పడి.. గ్లాస్ టేబుల్ చివరన పెడుతుంది. ఆ గ్లాస్ కింద పడుతుంటే కార్తీక్ వచ్చి పట్టుకుంటాడు. కొంచెం అలెర్ట్ గా ఉండాలి కదా జ్యోత్స్న అని కార్తీక్ అంటాడు. అవును అలెర్ట్ గా లేకపోవడం వల్లే ఇక్కడికి వచ్చిందని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న ఇంకా జరిగిందే గుర్తుకుచేసుకొని ఆలోచిస్తుందని సుమిత్ర అనుకుంటుంది. ఇప్పుడు బావతో అన్ని విషయాలు డైరెక్ట్ గా మాట్లాడాలని జ్యోత్స్న అనుకొని.. బయటకు వెళదాం బావ అంటుంది. ఎందుకు అలా అడుగుతున్నావు.. నీకు కాబోయే భర్తని కదా ఆర్డర్ వెయ్ అని సుమిత్ర అంటుంది. వెళ్లడం ఇష్టం లేదు కానీ అత్తయ్య ఏమైనా అనుకుంటుందని వెళ్ళక తప్పదని.. కార్తీక్ సరే వెళదామని అంటాడు.

కార్తీక్ , జ్యోత్స్న ఇద్దరు వెళ్తుంటే రోడ్డుపై శౌర్య ఐస్ క్రీమ్ తీసుకుంటు కన్పిస్తుంది.. కార్తీక్ కార్ ఆపి.. ఇక్కడేం చేస్తున్నావని అడుగుతాడు. ఇదే మా స్కూల్ అని శౌర్య చెప్తుంది. ఎండగా ఉందంటూ శౌర్యని కార్ లో కూర్చొపెట్టి మాట్లాడతాడు కార్తిక్. నేను ఆ స్కూల్ లో జాయిన్ చెయ్యమన్నా కదా అని కార్తీక్ అంటాడు. అందులో జాయిన్ కావాలంటే అమ్మనాన్న చదువుకొని ఉండాలట అని శౌర్య అంటుంది. ఈ స్కూల్ గురించి చెపినట్టు మా అమ్మతో చెప్పకని కార్తిక్ తో శౌర్య అంటుంది. అదంతా వింటున్న జ్యోత్స్నకి కోపం వస్తుంది. ఆ తర్వాత ఎక్కడికి లేదు ఇంటికి వెళ్ళని జ్యోత్స్న కోపంగా అనగానే.. కార్తీక్ సరే అంటాడు. మరొకవైపు సుమిత్రతో కాంచన ఫోన్ మాట్లాడుతుంది. శ్రీధర్ కిచెన్ లో.. ఎవరో ఒకావిడ తో ఫోన్ మాట్లాడతాడు. బేబీ ఈ రోజు వస్తాను మళ్ళీ చేస్తానంటూ ప్రేమగా మాట్లాడతాడు. మళ్ళీ ఏం తెలియనట్టు కాంచన దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడతాడు. ఆ తర్వాత కార్తీక్ వస్తాడు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని శ్రీధర్ అడుగుతాడు. ఇష్టం లేదనే విషయం కూడా చెప్పలేని సిచువేషన్ లో ఉన్నానని అనుకొని.. రెండు నెలల తర్వాత చెప్తానని కార్తీక్ అంటాడు.

ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వస్తుంది. జ్యోత్స్న జరిగింది చెప్తుంది. అసలు బావకి నేను అంటే కొంచెం కూడా వాల్యూ లేదని జ్యోత్స్న అంటుంది. ఆ పిల్ల ద్వారా అంత తెలుసుకోవాలని పారిజాతం అంటుంది. మరోవైపు దీప, శౌర్య ఇద్దరు సైకిల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే పారిజాతం వస్తుంది. సైకిల్ ఏంటని అడుగుతుంది. ఇక శౌర్య సైకిల్ తనదే అని, అది మా అమ్మ పోటీలో గెల్చుకుందని చెప్తుంది. అంతేకాకుండా అది కార్తీక్ ఇచ్చాడని శౌర్య చెప్పగానే పారిజాతం షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.