English | Telugu

Karthika Deepam2 : ఎమోషనల్ అయిన శ్రీధర్.. వ్రతానికి సుమిత్ర రానుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -449 లో.. జ్యోత్స్నకి దిష్టి తీస్తుంది సుమిత్ర. దీప, కార్తీక్ పెళ్లి జరిగింది.. ఇక ఆ దోషం పోయినట్లే అని శివన్నారాయణ అంటాడు. దీప తాళి తెంపి జ్యోత్స్న మంచి పని చేసింది. ఆ అనాధకి దశరథ్, సుమిత్ర తల్లి దండ్రుల స్థానంలో ఉండి పెళ్లి చేసే అదృష్టం వచ్చింది. ఇక రేపు వ్రతానికి వెళ్లి అది దగ్గర ఉండి జరిపించి వస్తే మన బాధ్యత పూర్తి అవుతుందని పారిజాతం అనగానే ఈ మధ్య మంచిగ ఆలోచిస్తున్నావని శివన్నారాయణ అంటాడు. దాంతో పారిజాతం మురిసిపోతుంది.

సుమిత్ర నువ్వు కూడా వస్తావ్ కదా అని పారిజాతం అనగానే నేను టైడ్ అయ్యనని కోపంగా లోపలికి వెళ్తుంది. మరొకవైపు శ్రీధర్ కి కార్తీక్ ఫోన్ చేస్తాడు. ఈ టైమ్ కి చేసావ్ ఏంటని శ్రీధర్ అడుగుతాడు. నీకు థాంక్స్ చెప్పాడనికి చేశానని కార్తీక్ అంటాడు. భోజనం చేసావా అని శ్రీధర్ ని కార్తీక్ అడుగగానే శ్రీధర్ ఎమోషనల్ అవుతాడు. చేసాను నువ్వు చేసావా అని శ్రీధర్ ప్రేమగా మాట్లాడతాడు. ఎక్కువ డ్రింక్ చెయ్యకు అని కార్తీక్ ఫోన్ కట్ చేస్తాడు. చాలా రోజులకి తన కొడుకు ప్రేమగా మాట్లాడాడని శ్రీధర్ ఎమోషనల్ అవుతాడు.

ఆ తర్వాత సత్యనారాయణ వ్రతానికి అనసూయ కాంచన ఏర్పాట్లు చేస్తుంటారు. అప్పుడే పారిజాతం, జ్యోత్స్న వస్తారు. మీకు హెల్ప్ చెయ్యడానికి మేము వచ్చాము.. వెనకలా వాళ్ళు పూజ టైమ్ కి వస్తారని పారిజాతం అనగానే.. అందరు ఆశ్చర్యంగా చూస్తారు. పెళ్లి అయిన ఇల్లు ఇలా ఉంటుందా అని శౌర్యాతో పాటు పారిజాతం, జ్యోత్స్న డ్యాన్స్ చేస్తుంటారు. పారిజాతం, జ్యోత్స్న అలా బెహేవ్ చేస్తుంటే అందరు ఆశ్చర్యంగా చూస్తారు. మరొకవైపు శివన్నారాయణ, దశరథ్ రెడీ అయి సుమిత్రని పిలుస్తారు. నేను రానని సుమిత్ర చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.