English | Telugu

Karthika Deepam2 : మనసు మార్చుకున్న శ్రీధర్.. జ్యోత్స్నకి ఇచ్చిపడేసిన దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -461 లో......కాశీ పోలీస్ స్టేషన్ లో స్వప్న ఉన్నాడని ఏడుస్తుంది. అప్పుడే శ్రీధర్ వస్తాడు. ఎందుకు మమ్మల్ని ఇలా లోపల ఉంచి లాక్ వేసి వెళ్లారని శ్రీధర్ పై కావేరి కోప్పడుతుంది. ఆయనకు మనసు ఉంటేనే కదా మమ్మీ అని స్వప్న కూడా శ్రీధర్ ని తిడుతుంది. అప్పుడే కాశీ, దాస్ ఇంట్లో కి వస్తారు. కాశీని చూసి స్వప్న సంతోషపడుతూ నిన్ను మావయ్య బయటకు తీసుకోని వచ్చాడా.. చాలా థాంక్స్ మావయ్య మిమ్మల్ని చూసి కొంతమంది బుద్ది తెచ్చుకోవాలని స్వప్న అంటుంది.

నేను తీసుకొని రాలేదని దాస్ అనగానే మరి అన్నయ్య తీసుకొని వచ్చాడా అనీ స్వప్న అడుగుతుంది. లేదు శ్రీధర్ బావ తీసుకొని వచ్చాడని దాస్ అనగానే స్వప్న, కావేరి షాక్ అవుతారు. బావ వాళ్ళతో మాట్లాడి డబ్బు ఇచ్చి కేసు వెనక్కి తీసుకునేలా చేసాడు. ఇలాంటి అప్పుడే ప్రేమలు బయటపడుతాయి. ఇదంతా నీ కోసం చేశాడని స్వప్నతో దాస్ అంటాడు. ఇక వెళ్తామని కాశీ అనగానే జాబ్ పోయింది.. రెంట్ ఎలా కడుతావ్ ఇక్కడే ఉండండి అని శ్రీధర్ అంటాడు. మరొకవైపు శివన్నారాయణ ఇంటికి దీప, కార్తీక్ శౌర్య వెళ్తారు. శౌర్యకి దశరథ్ చాక్లెట్ ఇస్తాడు. అది తీసుకొని సుమిత్ర దగ్గరికి వెళ్తుంది. అవి మీ తాత ఇచ్చాడా అని అడుగుతుంది నీకెలా తెలుసని శౌర్య అడుగుతుంది. అవి అంటే ఆయనకి ఇష్టమని సుమిత్ర చెప్తుంది. అదంతా దీప వింటుంది. ఏంటి దీప ఇక్కడున్నావని సుమిత్ర దగ్గరికి తీసుకొని వెళ్తుంది జ్యోత్స్న. తనతో ఏదో విధంగా దీపని తిట్టించాలని జ్యోత్స్న చూస్తుంది. కానీ సుమిత్ర దీపని వెళ్ళమని చెప్పి అనవసరం అయిన విషయం పక్కన పెట్టి తాతయ్య నీకు ఇచ్చిన టైంమ్ కొద్దీ రోజులే ఉందని జ్యోత్స్నపై సుమిత్ర కోప్పడుతుంది.

ఆ తర్వాత జ్యోత్స్న బయటకు రాగానే దీప తనని చూసి సుమిత్రమ్మ బాగా ఇచ్చినట్లుందని అంటుంది. నేనొకటి ఇవ్వాలని జ్యోత్స్న తెంపిన తాళిని దీప తన చేతిలో పెడుతుంది. ఇది నీదే కదా కార్తీక్ బాబు.. నీ మెడలో కట్టాలని తీసుకొని వచ్చవ్ కానీ నా మెడలో పడింది.. చాలా సార్లు దీని గురించి గొడవ అయింది మనకి అని దీప అనగానే జ్యోత్స్నకి కోపం వస్తుంది. ఆ తర్వాత దీప వెళ్ళిపోయాక కార్తీక్ వచ్చి.. నా భార్య నీకేదో ఇస్తానంది ఇచ్చిందా అని వెటకారంగా అడుగుతాడు. దాంతో జ్యోత్స్నకి ఇంకా కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.