English | Telugu

Karthika Deepam 2 : ఇంకొక అమ్మాయిని కంటే బాగుండేది.. భార్య మాటతో భర్త షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -42 లో...ఎవరు చూడకుండా పారిజాతం బంటూతో గోడ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. చేసిన పని బాగా చేస్తే ఇలా చాటుగా మాట్లాడే అవసరం వచ్చేది కాదు కదా అని పారిజాతం అంటుంది. అంత ఆ పిల్ల దెయ్యం చేసిందని బంటు అనగానే... ఆ పిల్లని ఏం అనకురా ఇప్పుడు తల్లి కంటే పిల్లకే ఎక్కవ అభిమానులు ఉన్నారని పారిజాతం అంటుంది. అందరికి భయపడుతూనే నేను గోడకి ఇవతలి పక్కనున్నానని బంటు అంటాడు.

ఆ తర్వాత ఆ దీపని ఇంట్లో నుండి పంపించెయ్యాలని ఇద్దరు అనుకుంటారు. నువ్వు దాని ఊరు వెళ్లి దానికి సంబంధించిన మొత్తం వివరాలు కనుక్కుంటే దాని బలహీనత తెలిస్తే దాని మీద దెబ్బ కొట్టొచ్చు.. నువ్వు ముందు వెళ్ళమని బంటుని పారిజాతం పంపిస్తుంది. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం నర్సింహా.. దీపతో సుమిత్ర ఇంటికి వస్తాడు. ఇక్కడేం గొడవ చేయకని దీప అన్నా కూడా నర్సింహా వినిపించుకోడు.. అందరు హాల్లోకి వస్తారు. వాడెక్కడ అంటూ దీప జుట్టు పట్టుకుంటాడు నరసింహా. అప్పుడే కార్తీక్ వచ్చి నర్సింహా కాలర్ పట్టుకుంటాడు. నాకు తెలుసు దీన్నేం అననివ్వవని నరసింహ అంటాడు. అసలు నీకు వాడికి సంబంధమేంటి ? ఇద్దరు ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుతున్నారు.. నా కూతురు నీ కూతురు అయినట్టు చూసుకుంటున్నావని నరసింహా తప్పుగా మాట్లాడుతుంటే.. నర్సింహాపై సుమిత్ర చెయ్యి చేసుకుంటుంది. దీపకి ఎవరు లేరు అనుకుంటున్నావా.. నేను ఉన్నాను అని సుమిత్ర అంటుంది. నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపో లేదంటే ఏం చేస్తానో కూడా నాకు తెలియదని నర్సింహా అంటాడు.

దీప ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది. ఏం చేసుకుంటావో చేసుకోమని సుమిత్ర అనగానే.. అది నాతో వచ్చేవరకు ఇక్కడే ఉంటానని నరసింహా అంటాడు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళుకుంటే పోలీసిలని పిలుస్తానంటూ దశరత్ అంటాడు. నువ్వు వాడి బలం చూసుకొని ఇలా ఉంటున్నావ్ కదా అంటూ కోపంగా దీపతో నరసింహా అనేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత దీప ఏడుస్తూ తన రూమ్ కి వెళ్తుంది. మరొకవైపు కార్తీక్ పేరెంట్స్ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తీక్ ఎప్పుడు ఇంట్లో ఉండడం లేదు.. మనం ఇంకొక అమ్మాయిని కంటే బాగుండేది అనగానే కాంచన భర్త షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.