English | Telugu

Karthika Deepam2: సుమిత్రకి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పేసిన జ్యోత్స్న.. టెన్షన్ లో కార్తీక్, దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం-2 (Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-569లో.. దాస్ ని ఒక దగ్గర బంధిస్తుంది జ్యోత్స్న. తనకి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు జ్యోత్స్న అని దాస్ అంటాడు. నా జాగ్రత్త నాకు తెలుసు నాన్న నువ్వు జాగ్రత్తగా ఉండమని జ్యోత్స్న చెప్పి వెళ్తుంది. దాస్ ఫోన్ ని ఛార్జ్ పెట్టమని, కాల్ చేస్తున్నారో చూడాలి.. ఆ ఫోన్ పట్టుకొని సిటీ అంతా తిరమని రౌడీలకి జ్యోత్స్న చెప్పి వెళ్ళిపోతుంది.

మరోవైపు దాస్ గురించి కార్తీక్, దీప ఇద్దరు మాట్లాడుకుంటారు. నేను అక్కడికి వెళ్ళేసరికి జ్యోత్స్నతో పాటు పారిజాతం ఉంది. పారిజాతం ఉండగా దాస్ ని జ్యోత్స్న ఏం చేయలేదు ఎందుకంటే పారిజాతంకి కొడుకు అంటే ప్రేమ. అయితే ఆమెకి తెలియకుండా దాస్ ని జ్యోత్స్న ఏదైనా చేసుండాలి. లేదంటే దాస్ తన కోపాన్ని అణుచుకొని ఉండాలని దీపతో కార్తీక్ అంటాడు. ఇక మరుసటి రోజు కార్తీక్, దీప ఇద్దరు శివన్నారాయణ ఇంటికి వెళ్తారు. ఈ రోజు అత్తయ్యని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలని కార్తీక్ అంటాడు. మరి ఎలా చెప్పాలని దీప అడుగగా.. మామయ్య చెప్పినట్టే మనం ఒక డ్రామా ఆడాలని, నిజం దాచాలని కార్తీక్ చెప్తాడు. అదే సమయంలో గదిలో ఉన్న సుమిత్రకి దగ్గు వస్తుంది. దగ్గు ఎక్కువ అవ్వడంతో సుమిత్ర పైనుండి కిందకి వస్తుంటుంది. ఇక కళ్ళు తిరిగి పడిపోతుంటే అప్పుడే దీప వచ్చి సుమిత్రని పట్టుకుంటుంది.

నిన్ను రూమ్ లోనే ఉండమన్నాను కదా అని సుమిత్రని దశరథ్ అంటాడు. దగ్గు వచ్చింది.. కళ్ళు తెరిచి చూస్తే కళ్ళు కనపడటం లేదు.. అందుకే కిందకి వచ్చానని సుమిత్ర చెప్తుంది. అత్తని హాస్పిటల్ కి తీసుకెళ్దామని కార్తీక్ అనగానే నన్నెందుకు హాస్పిటల్ కి తీసుకెళ్ళడమని సుమిత్ర అంటుంది. వెళ్తే మంచిది కదా అని శివన్నారాయణ అంటాడు. కళ్ళు కనపడట్లేదని అంటున్నావ్ కదా హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్ చెక్ చేస్తాడని పారిజాతం అంటుంది. దగ్గు వస్తుందని అంటున్నావ్ కదా హాస్పిటల్ కి వెళ్తే చెక్ చేస్తారని కార్తీక్ అంటాడు. అసలు ఏం జరిగిందిరా నాకు ఎందుకు హాస్పిటల్ అంటున్నారు.. టెస్ట్ లు అంటున్నారు.. నిజం చెప్పండి అని సుమిత్ర అందరిని అడుగుతుంది కానీ ఎవరు చెప్పరు. నువ్వు నా కూతురివి కదా.. నా మీద ఒట్టేసి చెప్పు అని జ్యోత్స్న చేతిని తలమీద వేసుకొని అడుగుతుంది. దాంతో అందరు షాక్ అవుతారు. కార్తీక్ ఏదో చెప్పబోతుంటే.. మీరు ఎవరు మాట్లాడిన నేను చచ్చినంత ఒట్టే అని సుమిత్ర అంటుంది. ఇక చేసేదేమీ లేక జ్యోత్స్న నిజం చెప్తుంది. మీకు బ్లడ్ క్యాన్సర్ మమ్మీ అని జ్యోత్స్న అనగానే సుమిత్ర షాక్ అవుతుంది. వెంటనే కూర్చుండిపోతుంది. దగ్గు వచ్చి బ్లడ్ వాంథింగ్ చేసుకుంటుంది సుమిత్ర. అది చూసి అందరు షాక్ అవుతారు. నాకు బ్లడ్ క్యాన్సర్.. అంటే నేను చనిపోతానని సుమిత్ర అనగానే కార్తీక్ వెంటనే డాక్టర్ కి కాల్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.