English | Telugu

వాళ్ళకి పెళ్ళి జరిగి ఆరేళ్ళైంది.. శౌర్య వాళ్ళ కూతురే!

ఊహించని ట్విస్ట్ లతో తెలుగు సీరియల్స్ సాగుతున్నాయి. స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ లలో కార్తీకదీపం-2 కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కార్తీక్, దీప ఇద్దరు కలుస్తారా లేదా అన్న క్యూరియాసిటితో మొదలైన రెండవ భాగం ఇప్పుడు మరింత ఉత్కంఠభరితంగా మారింది.

జ్యోత్స్న చేసిన తప్పుని పోలీసులు ఇంటికి వచ్చి అడిగినప్పుడు తెలియక దీప సమాధానం చెప్పడంతో తను పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. అక్కడి నుండి కథ పూర్తిగా మారింది. అప్పటిదాకా సుమిత్ర, దశరథ్, జ్యోత్స్న అందరు కలిసి దీప, శౌర్యలని బాగా చూసుకోగా.. ఎప్పుడైతే జ్యోత్స్న స్టేషను కి వెళ్ళిందో అక్కడి నుండి దీపని నెగెటివ్ గా చూస్తున్నారు‌. దీనికి తోడు పారిజాతం కల్పించి చెప్పే మాటలకి జ్యోత్స్న మైండ్ మొత్తం దీప మీద నెగెటివ్ నింపుకుంది. మరోవైపు దీప కష్టాలు దీపవి.. అటు నరసింహా రెండో పెళ్ళి చేసుకున్నాడని తన అత్త అనసూయకి చెప్పగా.. తను రెండో కోడలి ఆస్తికి ఆశపడి వారితో కలిసిపోవడంతో తను ఒంటరిగా మిగిలింది. ఇక ఒంటరిగా బాధపడుతుంటే కడియం కూడా అంతే బాధలో ఉండటంతో.. తనకి సాయం చేయడానికి ముందుకొచ్చింది దీప.

నేటి ప్రోమోలో శౌర్యని స్కూల్ లో జాయిన్ చేయడానికి కార్తిక్ తనని తీసుకెళ్తుంటే దీప చూసి ఆపుతుంది. ఏమైంది ఎక్కడికి తీసుకెళ్తున్నారు బాబు అని దీప అనగా.. స్కూల్ లో జాయిన్ చూపించడానికి అని కార్తిక్ అంటాడు. మరోవైపు జ్యోత్స్న , పారిజాతం మాట్లాడుకుంటారు. " నాకలా కనపడటం లేదుగా" అని పారిజాతం అనగా.. మరి ఇంకెలా కన్పిస్తుందని జ్యోత్స్న అడుగుతుంది. "వాళ్ళిద్దరికి పెళ్ళి అయి ఆరేళ్ళు అయినట్టు.. శౌర్యేమో వాళ్ళిద్దరికి కూతురు అయినట్టు.. అది జాలి కాదు భాద్యత అంటే నీకు అర్థమవ్వట్లేదా" అని పారిజాతం అంటుంది. మరోవైపు నా మీద గానీ నా బిడ్డ మీద గానీ జాలి చూపించడం నాకు ఇష్టం ఉండదు బాబు అని కార్తిక్ తో దీప అంటుంది‌. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.