English | Telugu

గాయపడిన వారిని కాపాడిన జానీ మాస్టర్...


టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అటు కొరియోగ్రాఫర్ గా ఇటు జనసేనలో కార్యకర్తగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాల్లో కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్ పనిచేశారు. టాప్ స్టార్స్ అందరితో కలిసి ఆయన పనిచేశారు. ఎన్నో సూపర్ హిట్ మూవీస్ కి కూడా కొరియోగ్రాఫర్‌గా పనిచేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తెలుగు బుల్లితెరపై పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా పనిచేశారు జానీ మాస్టర్. అలాంటి జానీ మాస్టర్ రీసెంట్ గా ప్రమాదం బారిన పడిన ఇద్దరిని కాపాడారు. దానికి సంబంధించిన ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. "నిన్న జనసేన అధినేతని కలిసి తిరిగి వెళుతుండగా విజయవాడ బెంజ్ సర్కిల్ కరకట్ట దగ్గర వేరు వేరు ప్రమాదాలు జరిగాయి.

గాయాలతో బాధపడుతున్న వారిని వెంటనే ఆసుపత్రికి తరలించకుండా అక్కడున్న వారు, ఆఖరికి పోలీసు అధికారులు కూడా అంబులెన్సు కోసం ఎదురుచూస్తూ ఉండడం గమనించా. వెంటనే స్పందించి వారికి ప్రథమ చికిత్స అందించి హాస్పిటల్ కి వైద్యం కోసం తరలించాం. ఆపద సమయంలో సాయం అందించడం కూడా దైవ కార్యమే కదా!!" అంటూ తాను చేసిన పని గురించి అక్కడ అసలేం జరిగిందో వివరంగా పెట్టారు. ఇక ఆయన చేసిన మంచి పనికి నెటిజన్స్ ఫిదా ఇపోయారు. "మంచి పని చేశావన్న...ఏం అడిగిన కాదు అనకుండా విసుగు లేకుండా అడగగానే ఫోటో కూడా ఇస్తారు మీరు .. మీలాంటి వాళ్లకి దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటారు అన్న. ఆ నొప్పి తెలిసినోడు, ఆ స్థాయి నుండి వెళ్లినోడికే తెలుసు సాయం చేయడం ..మీది చాలా మంచి మనసు. సెల్యూట్ మాస్టర్, సూపర్ బ్రో, లవ్ యు అన్న, మీరు ఆల్రెడీ డాన్స్ లో సక్సెస్ అయ్యారు. మా తరం వారికి మీరు మంచి ఇన్స్పిరేషన్ గా మారారు. జనసేనలో మీలాంటి వాళ్ళు ఉన్నందుకు నిజంగా గొప్ప విషయం. అసలైన జనసైనికుడు అంటే ఇలా ఉంటారు..జానీ మాస్టర్ మీరు గ్రేట్. " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.