English | Telugu

Jayam serial : జయం సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. గంగ కోసం వచ్చిన రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -80 లో.. నిన్ను ఎంతో నమ్మాను.. నీలో నా కొడుకు ప్రేమని చూసుకున్నాను కానీ నువ్వు నాకు నమ్మకద్రోహం చేసావ్.. నాతో ప్రేమగా ఉంటుంటే ఆ రుద్ర ఏం తప్పు చెయ్యలేదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నావని గంగపై శకుంతల కోప్పడుతుంది. నేను అలా మీకు నమ్మకద్రోహం చెయ్యలేదని శకుంతల కాళ్లపై పడుతుంది గంగ.

అయిన వినకుండా శకుంతల చిరాకు పడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. గంగ తన గదివైపు వెళ్తుంటే.. ఏంటి గంగ ఎక్కడికి వెళ్తున్నావ్.. ఇంకా ఇంత జరిగిన కూడా ఇంట్లోకి వెళ్తున్నావ్ ఇంట్లో వాళ్లంతా నీపై చిరాకు పడుతున్నారని గంగతో ఇషిక అంటుంటే.. వెళ్తుందిలే ఇషిక అని వీరు అంటాడు. నాకు సంబంధించిన వస్తువులు పైన ఉన్నాయి.. అవి తీసుకొని రావడానికి వెళ్తున్నానని గంగ అంటుంది. ఆ తర్వాత మణికి వీరు ఫోన్ చేసి గంగని ఇంట్లో నుండి గెంటేసారు.. ఏం చేసుకుంటావో నీ ఇష్టమని చెప్తాడు. మరొకవైపు గంగ వెళిపోతు రుద్ర రూమ్ ముందు ఆగి నన్ను క్షమించండి అని చెప్తుంది. ఆ తర్వాత గంగ తన ఇంటికి వెళ్తుంది. అక్కడ మణి తాళితో రెడీగా ఉంటాడు.

బలవంతంగా గంగ మెడలో తాళి కట్టబోతుంటే గంగ వాళ్ళ అమ్మ లక్ష్మి వచ్చి మణి మెడపై కత్తిపీట పెడుతుంది‌. దాంతో మణి భయపడుతాడు. ఈ పైడిరాజ్.. నీ కూతురితో నా పెళ్లి చేస్తానన్నాడు.. డబ్బులు తీసుకున్నాడు.. నా డబ్బు నాకు ఇవ్వండి అని మణి అడుగుతాడు. తరువాయి భాగంలో గంగ ఇంట్లో లేదని రుద్రకి తెలిసి తన ఇంటికి వస్తాడు. నేను మీకు మాటిచ్చాను.. నీ కూతురిని జాగ్రత్తగా చూసుకుంటానని అందుకే గంగని నా వెంట తీసుకొని వెళ్తున్నానని గంగ చెయ్యి పట్టుకొని రుద్ర తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.