English | Telugu

శైలేంద్ర దెబ్బకి రిషి కాలేజీ నుండి అవుట్!

స్టార్ మా టీవీలో ప్రసరమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -773 లో....రిషి ని శైలేంద్ర నుండి కాపాడుకోవడానికి.. వసుధార దగ్గర మాట తీసుకొని అబద్ధం చెప్పమని జగతి అడుగుతుంది. అయితే వసుధార మొదట్లో వద్దని చెప్పినా తర్వాత కన్నతల్లిగా రిషి కోసం జగతి పడే తపనకి వసుధారకి తలవంచక తప్పలేదు. అబద్దం చెప్తానని మాట ఇచ్చింది. ఇక మీటింగ్ లో అందరూ రిషి తప్పు చేసాడని అంటారు. మిషన్ ఎడ్యుకేషన్ ఫండ్స్ మెడికల్ కాలేజీకి ఉపయోగించుకుంటున్నాడని అభియోగం చేసారని జగతి అంటుంది. అందుకు సంబంధించిన సాక్ష్యాలుగా రిషి, వసుధారలు సంతకం చేసిన చెక్ ఉందని జగతి అంటుంది.

ఆ తర్వాత మేము సంతకాలు పెట్టలేదని రిషి అంటాడు. అయిన సాక్ష్యాలు కన్పిస్తున్నాయి కదా అని జగతి అంటుంది. అలా అనగానే ఆ చెక్ మనం ఇచ్చామా వసుధార అని రిషి అడుగుతాడు. వసుధార ఏడుస్తూ సైలెంట్ గా ఉంటుంది. ఎన్నిసార్లు అడిగినా వసుధార సమాధానం చెప్పకుండా ఉండేసరికి.. రిషికి కోపం వచ్చి.. చెప్పు వసుధార అని గట్టిగ అరుస్తాడు. వసుధార ఏడుస్తూ.. మీరే ఇచ్చారని అబద్ధం చెప్తుంది. వసుధార అలా అనగానే రిషి గుండె ముక్కలవుతుంది. ఏం మాట్లాడుతున్నావ్ వసుధార నిజం చెప్పమని రిషి అంటాడు. మీరే ఇచ్చారని వసుధార అంటుంది.

నువ్వే ఇచ్చావని వసుధార అంటుంది కదా రిషి.. ఏమైనా దాని గురించి చెప్పాలనుకుంటున్నావా అని రిషిని మినిస్టర్ అడుగుతాడు. తప్పు చేసానని చెప్పకా.. నేనేం మాట్లాడగలను.. దీనికి మీరు ఏ శిక్ష విధించిన బరిస్తానని రిషి అంటాడు. మీరు ఎండి పదవి నుండి తప్పుకోవాలి. కాలేజీకి సంబంధించిన ఏ అడ్మినిస్ట్రేటర్ చెయ్యకూడదు.. వేరే కాలేజీలల్లో కూడా ఎండీ గా భాద్యతలు తీసుకోకూడదని జగతి అంటుంది. అందరూ షాక్ అవుతారు. దేవయాని, శైలేంద్రలు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు.

అవును తప్పు చేసాను.. నా చుట్టూ ఉన్న మనుషులను నమ్మి తప్పు చేశాను. ఈ కాలేజీ నాకనవసరం.. ఈ కాలేజీలో ఉండను. మీ జీవితాల్లో కుడా ఉండనని రిషి అంటాడు. మీకు దూరంగా వెళ్ళిపోతాను. ఇక నుండి రిషి ఒంటరి.. ఇప్పుడే నాకు క్లారిటీ వచ్చిందంటూ.. వసుధార, జగతిలని ఉద్దేశించి అంటాడు. ఆ తర్వాత కొత్త ఎండీగా జగతి మేడం ఉంటారని మినిస్టర్ అనగానే.. శైలేంద్ర షాక్ అవుతాడు. ఇంత ప్లాన్ చేసింది ఎండీ చేర్ కోసం అలాంటిది పిన్ని ఎండీ నా అని కోపంగా ఉంటాడు. రిషి బాధపడి వెళ్తుంటే వసుధార, జగతిలు రిషి వెనకాలే వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.