English | Telugu

ఇండస్ట్రీలో కొందరు నన్ను బెదిరించారు

జబర్దస్త్ తన్మయ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఫుల్ కామెడీ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ ఆమె ఒక ఇంటర్వ్యూ చేసింది. అందులో తన జీవిత కష్టాలన్నీ చెప్పుకొచ్చింది. అసలు తానూ ఎలా ట్రాన్ఫర్మ్ కావాల్సి వచ్చింది...అప్పుడు ఎదుర్కున్న కష్టాలు, మాటల దాడుల గురించి చెప్తూ బాధపడింది. ఐతే ఇంకో ముఖ్య విషయాన్ని కూడా షేర్ చేసుకుంది. లాస్ట్ ఇయర్ ఆగస్టు లో తన్మయ్ ఫాదర్ కన్నుమూశాడు. "ఐతే ఆయన చనిపోయే ముందు రోజు రాత్రి శ్రీదేవి డ్రామా కంపెనీ షూటింగ్ ఐపోయాక నాన్నతో వీడియో కాల్ లో మాట్లాడాను. ఆ తర్వాత రోజు ఉదయం 11 గంటలకు నాన్న చనిపోయాడు అన్న న్యూస్ వచ్చింది.

ఆ టైములో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీలేదు.ఎం చేయాలో తెలీలేదు. షాక్ లో ఉండి ఇమ్మానుయేల్ కి ఫోన్ చేసాను.అమ్మ షూటింగ్ లో ఉన్నాను లేదంటే వచ్చేవాడిని అని చెప్పాడు. తర్వాత నూకరాజుకు ఫోన్ చేశా. ఎక్కడి పనులు అక్కడ వదిలిపెట్టి, షూటింగ్ ని కూడా వదిలేసి కార్ వేసుకుని వచ్చేసాడు. నేను ఏడుస్తూనే ఉన్నాను. హైదరాబాద్ లో నా చెయ్యి పట్టుకున్నవాడు మా నాన్న దగ్గరకు వెళ్లేంత వరకు నా చెయ్యి వదల్లేదు. నాకు ధైర్యం చెప్తూనే ఉన్నాడు. నాకు తెలిసి నాకు హెల్ప్ చేసిన వ్యక్తి నూకరాజు ఒక్కడే. డబ్బులుపరంగా కూడా ఎవరూ హెల్ప్ చేయలేదు. ఎవరి లైఫ్ వాళ్లకు ఉంటుంది. నేను రెండేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి కారణం కొంతమంది పెద్ద హోదాలో ఉన్నవాళ్లు నన్ను కొట్టి, తిట్టి, నన్ను బెదిరించారు...ఇవన్నీ తెలిస్తే మా అమ్మా వాళ్ళు బాధపడతారని నేను ఎప్పుడూ చెప్పలేదు." అంటూ తన్మయ్ తన జీవితంలో పడిన కష్టాలని చెప్పుకొచ్చింది.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.