English | Telugu

నేను సుధీర్‌కు లైఫ్ ఇచ్చాను.. కానీ అత‌ను నేను ఫోన్ చేస్తే..

జబర్దస్త్ షో రచ్చ మాములుగా లేదు. ఆర్పీ మాట్లాడిన మాటలు ఇప్పుడు కార్చిచ్చులా రగులుతూ జబర్దస్త్ వేదికను తగలబెడుతున్నాయి. ఇప్పటివరకు ఆర్పీకి, కొందరి సీనియర్ కమెడియన్స్, ప్రొడ్యూసర్స్ కి మధ్య జరిగిన వాదోపవాదాలు విన్నాం. ఇక ఇప్పుడు జబర్దస్త్ షో స్టార్టింగ్ లో మేనేజర్ గా పని చేసిన ఏడుకొండలు మీడియా ముందుకు వచ్చి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. కిర్రాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. "ఆర్పీ షోని వదిలేసి నాలుగేళ్లు అవుతోంది. ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంత వరకు కరెక్ట్?" అని అడిగారు. మల్లెమాలలో ఫుడ్ బాగుంటుంది, పేమెంట్ కూడా రెగ్యులర్ గా టైంకి ఇచ్చేస్తారని చెప్పుకొచ్చాడు.

ఇదే ఇంటర్వ్యూలో సుధీర్, శీనుపై కూడా ఏడుకొండలు ఆరోపణలు చేశారు. "నేను సుధీర్ కి లైఫ్ ఇచ్చాను. ఇప్పుడు ఇంతలా ఎదగడానికి కారణం నేను. కానీ నేను ఫోన్ చేస్తే మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు. శీను బయటకి వెళ్లి షోస్ చేయలేడు.. వీళ్లందరి సంగతి నాకు బాగా తెలుసు" అన్నాడు ఏడుకొండలు. ఐతే ఇంత రచ్చకు అసలు కారణం.. షో నుంచి నాగబాబు బయటికి వచ్చేస్తూ ఒకప్పుడు ఆయన కూడా ఇవే మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఆర్పీ ఆ మాటలకు ఆజ్యం పోసేసరికి వెనక నుంచి అంతా నడిపిస్తోంది నాగబాబు అని అనుకుంటున్నారంతా.

సుధీర్, ఆది, శీను, రోజా ఇలాంటి వాళ్లంతా వెళ్లిపోయేసరికి జబర్దస్త్ కళ చాలావ‌ర‌కు తగ్గిపోయింది. మరి ఈ రచ్చ మొత్తాన్ని వెనక ఉండి గమనిస్తున్న నాగబాబు రంగంలోకి దిగుతారా లేదా నాకెందుకులే అని వదిలేసి ఆయన పని ఆయన చూసుకుంటారా ? ఏమో ఇదొక అంతు తేలని ప్రశ్న.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.