English | Telugu

జబర్దస్త్ నరేష్ పెళ్లి చూపులు...వధువు ఎవరో తెలుసా!

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో చాలా ఫన్నీగా ఎమోషనల్ గా ఉంది. ఇక ఇందులో నాటీ నరేష్ పెళ్లిచూపులు జరిగాయి. బుల్లితెర మీద నాటీ నరేష్ అంటే తెలియని వారు లేరు. అతని హైట్ అతను చేసే కామెడీ ఫుల్ ఫన్నీగా ఉంటుంది. అలాంటి నరేష్ హైట్ మీద చాలామంది చాలా కామెంట్స్ చేస్తూ అసలు అతనికి పెళ్లవుతుందా అనేలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఐతే ఇప్పుడు నిజంగా ఆ ఘట్టం వచ్చిందంటూ ఆది చెప్పుకొచ్చాడు. "మా అందరికీ ఒక ఫామిలీ తరపున ఒక మెసేజ్ వచ్చింది. ఇలా నాటీ నరేష్ ని పెళ్లి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము తనకు ఒకే అంటే ఆ పెళ్లి చూపులేదో చేద్దాం...ఆ ఫామిలీ కూడా ఈ సెట్ కి వచ్చారు" అంటూ ఆది ఆ ఫామిలీని పరిచయం చేసాడు ఆది. పెళ్లి చేసుకోబోయే పిల్ల పేరు నవ్య. ఐతే నవ్య - నరేష్. అక్కడే పేర్లు కూడా కలిసిపోయాయి అని చెప్తూ ఆది నరేష్ ని ముద్దు పెట్టేసుకున్నాడు.

ఇక నవ్య మాట్లాడుతూ "నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే అంత దూరం ఇక్కడి వరకు వచ్చా. లవ్ యు. లవ్ యు ఫర్ ఎవర్" అని చెప్పింది. ఇక నరేష్ కూడా "నాకు కూడా మీరు బాగా నచ్చారు" అని సిగ్గుపడిపోతూ చెప్పాడు. తర్వాత సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఈ షోకి గెస్ట్ గా వచ్చారు. ఆమె కూడా నవ్యని ఒక ప్రశ్న వేశారు."ఏమ్మా నువ్వు డిగ్రీ పాసయ్యాక ఉద్యోగానికి పోతావా" అంది. "నరేష్ కి ఏది ఇష్టమైతే అదే నాకు ఇష్టం" అని చెప్పింది నవ్య. ఇక నాటీ నరేష్ వాళ్ళ నాన్న రెగ్యులర్ గా స్కిట్స్ లో కనిపిస్తూ తాగుబోతు క్యారెక్టర్స్ చేస్తూ ఫన్ చేస్తూ ఉంటాడు. అలాగే ఆయన ఈ ప్రోమోలో ఏడుస్తూ కనిపించాడు. "నరేష్ వాళ్ళ నాన్న ఏడుస్తుండే" అంటూ కొమరక్కా చెప్పేసరికి ఆయన కళ్ళు తుడుచుకుని "కొంతమంది నరేష్ పెళ్లవుతుందో కాదో అని చెప్తూ ఎగతాళి చేసేవాళ్ళు ఆ మాటలకు నాకు బాధగా అనిపించేది" అనేసరికి ఆది వాళ్ళ నాన్న కన్నీళ్లు తుడిచాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.