English | Telugu

నువ్వు మాస్ ఐతే నేను మానస్ ఊరమాస్ ఇక్కడ...

జబర్దస్త్ షో న్యూ ప్రోమో ఇప్పుడు అందరినీ అలరిస్తోంది. న్యూ చాప్టర్ బిగిన్స్ అని ఏదైతే చెప్పారో అది ఈ ఎపిసోడ్ లో కనిపించబోతోంది అన్న విషయం తెలుస్తోంది. ఇంత మార్పులు ఈ షోలో వస్తున్నా కూడా సుధీర్ ఎపిసోడ్ కి మాత్రం ఫుల్ స్టాప్ పడడం లేదు. ఇక జడ్జ్ ఖుషూ వచ్చి అన్నీ డబుల్ గా ఉండబోతున్నాయా అంది. అవును యాంకర్ కూడా డబుల్ కాబోతున్నారు అని చెప్పింది. ఇక రష్మీ పక్కన బ్రహ్మముడి హీరో మానస్ సెకండ్ యాంకర్ గా వచ్చేసాడు. ఐతే రావడమే ఒకప్పుడు సుడిగాలి సుధీర్ ఎలా ఐతే కళ్ళజోడు తీసి పెట్టి తనదైన మ్యానరిజమ్ ని చేసేవాడో మానస్ కూడా అలాగే చేసాడు. ఇక రష్మీ ఐతే ఉడుక్కుంది. "తెల్ల తోలు కదా స్టైలిష్ గా ఉంటది హలో మాస్ ఇక్కడ మాస్ పిల్ల" అంది.."నువ్వు మాస్ ఐతే నేను మానస్ ఊరమాస్ ఇక్కడ" అని కౌంటర్ డైలాగ్ వేసాడు. ఇప్పటి వరకు టీం లీడర్స్ మధ్యలో పోటీ జరిగింది కానీ ఇప్పుడు యాంకర్స్ మధ్యలో పోటీ ఉండబోతోంది అని చెప్పింది ఖుష్భూ. జబర్దస్త్ అమ్మాయి వెర్సెస్ ఖతర్నాక్ అబ్బాయి పేరుతో వీళ్ళ మధ్య పోటీ జరగబోతోంది.

ఇక స్కిట్స్ మీద ఆడియన్స్ స్పందనలు కూడా ఈ షోలో ఉండబోతున్నాయి ఇక. "చూసావా రష్మీ ఇప్పటి నుంచి మానస్ గాడి హవా స్టార్టవబోతోంది అంటూ కళ్ళజోడు తీసి పెట్టుకోబోతుండగా "వద్దు మానస్ ఈ స్పెక్ట్స్ ఇవన్నీ వద్దు. ఇవే పెట్టి పెట్టి" అంటూ రష్మీ ఒకప్పటి సుధీర్ ని గుర్తు చేసుకుంది. ఎప్పటిలాగే రాకింగ్ రాకేష్ పిల్లల్తో స్కిట్ చేయడానికి వచ్చాడు అతనితో ప్రవీణ్ ని కూడా తెచ్చుకున్నాడు. "ఈ స్టేజి మీద కొన్ని రోజులు నేను లేను కదా రష్మీ నా గురించి చాల ఫీలయ్యి ఉంటుంది కదా" అని అన్నాడు రాకేష్. "బిర్యానీలో ఆకు లాంటి ఆయన పోయినప్పుడే బాధపడలేదు. కూరలో కరివేపాకు లాంటోడివి నువ్వు పొతే బాధపడుతుందా" అంటూ ప్రవీణ్ కౌంటర్ వేసాడు. నూకరాజు స్కిట్ లో ఐతే బుల్లితెర సెలబ్రిటీస్ కూడా రాబోతున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.