English | Telugu

డింపుల్ హయాతి ఎంట్రీతో బైబై చెప్పేసిన ఖుష్బూ!

ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షో ఈ వారం కొంచెం అలరించింది. ఇంకొంచెం సప్పగా సాగింది. ఇక ఈ షోకి రామబాణం మూవీ టీమ్ నుంచి హీరోయిన్ డింపుల్ హయాతి, డైరెక్టర్ శ్రీవాస్ వచ్చారు. ఇక బులెట్ భాస్కర్ టీం దసరా మూవీని స్పూఫ్ గా చేసి చూపించారు. ఇక వీళ్ళ స్కిట్ ఎలా ఉంది అని డింపుల్ ని అడిగింది రష్మీ. "ఇమ్ము ఈ స్కిట్ కి మంచి ఎనర్జీ తీసుకొచ్చాడు" అని చెప్పింది. దాంతో వర్ష మధ్యలోకి వచ్చి "నిన్నటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాడు" అని చెప్పింది. చెప్పాలంటే "నేను మీకు పెద్ద ఫ్యాన్" ని అని డింపుల్ ఇమ్ముకి చెప్పేసరికి తెగ సిగ్గుపడిపోయాడు. ఇక ఆమె కుర్చీ దగ్గరకు వచ్చి చేతిలో చెయ్యేసి ఆమెను స్టేజి మీదకు తీసుకొచ్చి ఆమెతో డ్యూయెట్ స్టెప్ వేసాడు. బేసిక్ గా నేను డింపుల్ గారికి పెద్ద ఫ్యాన్ ని" అని చెప్పేసరికి "ఇమ్ము బై బై" అని చెప్పింది ఖుష్బూ.

"మీరు వెళ్ళిపోయినా పర్లేదు నాకు డింపుల్ గారు ఉంటే చాలు" అన్నాడు ఇమ్ము. ఇమ్ము మాటలకు ఫీల్ ఐపోయిన బులెట్ భాస్కర్ "ఆవిడ వెళ్ళిపోతే నేనెలా బతకాలిరా" అన్నాడు. ఆ మాటకు ఖుష్భు నవ్వుతూ దణ్ణం పెట్టేసింది. తర్వాత "ఈ ఫ్యాన్ మూమెంట్ ని ఒక స్టెప్ వేసి సెలెబ్రేట్ చేయాలి కదా" అంది రష్మీ అందరితో డాన్స్ చేయించింది. ఇక ఈ మూవీ టీమ్ కి బులెట్ భాస్కర్ విషెస్ చెప్పాడు. తర్వాత ఆటో రాంప్రసాద్ టీం వచ్చి స్కిట్ వేశారు. "మనదే పానీపూరి బండి..రష్మీ ఇది తిని చెప్పు ఎలా ఉందో" అని ఇచ్చాడు. "చాలా బాగుంది మరి నిన్న ఎందుకు బాలేదు" అని అడిగింది. "నిన్న స్నానం చేయలేదులే" అందుకే అని కుళ్ళు జోక్ వేసాడు రాంప్రసాద్. హీరోయిన్స్ ని చేయమంటూ శ్రీసత్య, కొమరయ్య, డింపుల్ రాంప్రసాద్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళను ఒక రేంజ్ లో ఆడుకున్నాడు.

ఇక శ్రీవాస్ స్టేజి మీదకు నరేష్ ని తీసుకొచ్చి "మేము ఇలా హీరోయిన్స్ కావాలంటూ వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని తెలిసి స్టింగ్ ఆపరేషన్ చేసాం. ఆల్రెడీ రామబాణం మూవీ షూటింగ్ ఐపోయింది. డింపుల్ మా మూవీలో హీరోయిన్...మీ గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి మా హీరోయిన్ ని పంపించాం" అని చెప్పాడు శ్రీవాస్. ఇలా ఈ వారం స్కిట్స్ ని పెర్ఫార్మ్ చేసి ఆటో రాంప్రసాద్ టీం, రౌడీ రోహిణి టీమ్స్ విన్నర్స్ గా నిలిచారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.