English | Telugu

యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటున్నా ? మీరేమంటారు...

జబర్దస్త్ షోకి యాంకర్ గా చేసిన అనసూయ మానేసరికి ఆమె ప్లేస్ లో రష్మీ వచ్చింది. ఇక రష్మీ కూడా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోస్ కి రష్మీ గౌతమ్ యాంకర్ గా చేస్తుండగా మూవీస్ తో బిజీ ఐపోతున్న కారణంగా రష్మిని జబర్దస్త్ నుంచి తప్పించి ఆమె ప్లేస్ లోకి సౌమ్య రావు ని తీసుకొచ్చారు.

ఇక ఈ యాంకర్ వస్తూనే ఆదిని చెడుగుడు ఆడేసుకుంది. ఆది కూడా సందర్భం వచ్చినప్పుడల్లా ఈమె మీద సెటైరికల్ గా డైలాగ్స్ వేసేవాడు. ఇక ఈమెకు తెలుగు రాదు అని చాలా మంది నెటిజన్స్ కూడా అన్నారు. రష్మీని చూసి ఉన్న ఆడియన్స్ కి కొత్త యాంకర్ అలవాటు కావడానికి కొంచెం టైం పట్టింది. ఇప్పుడు సౌమ్య జబర్దస్త్ తో పాటు మాల్స్ ఓపెనింగ్ కి కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. రీసెంట్ గా హైదరాబాద్ లో స్టార్ట్ చేసిన జొస్ అలుక్కాస్ వాళ్ళ ఐవీ జ్యువెలరీని లాంచ్ చేసింది. పసుపు రంగు శారీలో సౌమ్య అదిరిపోయింది.

ఇక ఇదే టైంలో అమ్మడు తన ఫాన్స్ ని ఒక ప్రశ్న వేసింది. దాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. " యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నా..గైస్ మీరేమంటారు ?" అని అడిగింది. ఈరోజున ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలి అంటే అన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో అకౌంట్స్ తెరవాల్సింది. ఇక ఇప్పుడు సౌమ్య కూడా యూట్యూబ్ ఓపెన్ చేసి మరింత ఫెమిలియర్ కావడానికి ట్రై చేస్తోంది. మరి మీరేమంటారు..

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.