English | Telugu

షోలో కన్నీళ్లు పెట్టుకున్న ఇంద్రజ...ఇన్నాళ్లు ఇది నేను మిస్ అయిపోయానా..

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోలో ఎవరు హైలైట్ ఐనా కాకపోయినా ఇంద్రజ మాత్రం తన కామెంట్స్ తో, తన సెటైరికల్ డైలాగ్స్ తో మంచి కామెడీ చేస్తూ ఉంటారు. అలాంటి ఇంద్రజ ఈ షోలో ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. కానీ నెక్స్ట్ వీక్ ప్రోమోలో మాత్రం ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ షోలో ఆమె చేసిన క్లాసికల్ డాన్స్ కి ఎందరో ఫిదా ఇపోయారు. ఆ డాన్స్ ఐపోయాక ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. "ఈ కాస్ట్యూమ్ నేను వేసుకున్నప్పుడు చెప్పలేదు కానీ..నాలో ఏదో ఆనందం పొంగుతోంది. ఇన్నాళ్లు ఇది నేను మిస్ అయిపోయానా" అంటూ.. గుక్క పెట్టి ఏడ్చేశారు. ఇంద్రజ ఎమోషనల్ అయిన తీరుతో అక్కడ అందరూ కూడా ఫీలైనట్టు కనిపించింది.

తర్వాత "బోలా శంకర్" మూవీ డైరెక్టర్ మెహర్ రమేష్ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన ముందు రష్మీ స్టెప్స్ వేసేసరికి "నేను స్టెప్స్ మెగాస్టార్ తో ఐనా నీతో ఐనా వేయిస్తాను" అని చెప్పా కదా అన్నారు. దానికి రష్మీ సిగ్గుపడిపోయింది. ఇక మానస్ అల్లూరి సీతారామరాజు గెటప్ తో వచ్చి స్కిట్ పెర్ఫార్మ్ చేసాడు. తర్వాత ఆటో రాంప్రసాద్ సుభాష్ చంద్రబోస్ గెటప్ లో వచ్చారు. ఆగష్టు 15 రాబోతున్న సందర్భంగా ఫ్రీడమ్ ఫైటర్స్ గెటప్స్ లో వచ్చి అందరూ అలరించారు. ఈ ప్రోమోకి నెటిజన్స్ కామెంట్స్ చూస్తే మాములుగా లేవు "మనకు స్వతంత్రం తీసుకొచ్చి ప్రాణాలర్పించిన మహానుభావులను గుర్తు చేసినందుకు శ్రీదేవి డ్రామా కంపెనీకి బిగ్ థాంక్స్ ..ఇంద్రజ గారి డాన్స్ సూపర్..మాటల్లేవ్..ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ తర్వాతనే ఎవరైనా" అంటూ కామెంట్స్ చేశారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.