English | Telugu

Illu illalu pillalu : భాగ్యం ఫ్యామిలీ గుట్టురట్టు చేసిన ప్రేమ, నర్మద.. శ్రీవల్లి షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -218 లో.... నర్మద ముందు సాగర్ వెళ్తు నర్మదని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. దాంతో బావగారు నీతో మాట్లాడడం లేదు కదా ఎందుకు అక్కా అబద్దం చెప్పావ్.. నా వల్లే ఇదంతా అని ప్రేమ ఫీల్ అవుతుంది. నీతో కూడా ధీరజ్ మాట్లాడడం లేదు కదా నాకు అర్ధం అయింది.. వాళ్ళే మాట్లాడతారని ప్రేమతో నర్మద అంటుంది.

ఆ తర్వాత వేదవతి డల్ గా ఉంటుంది. తిరుపతి వెళ్లి మాట్లాడతాడు. తిరుపతి మాటలకి వేదవతి తన చెంపచెల్లుమనిపిస్తుంది. అప్పుడే నర్మద, ప్రేమ వస్తారు. నేను చెప్పినట్లు చెయ్యండి అని వాళ్ళు తిరుపతికి చెప్పి వేదవతి దగ్గరికి పంపిస్తారు. నీ పెత్తనం లాగేసుకున్నారు అక్కా.. ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ వద్దు వెళదాం పద అని తిరుపతి అంటాడు. మమ్మల్ని విడదీయ్యాలి అనుకుంటావా అని వేదవతి మరొక చెంపపగులగొడుతుంది. అది మీ కోడళ్ళు చెప్పారని తిరుపతి అనగానే వేదవతి వాళ్ల వంక కోపంగా చూసి వెళ్ళిపోతుంది. మరొకవైపు ప్రేమ దగ్గరికి ధీరజ్ భోజనం తీసుకొని వస్తాడు. భోజనం చేయలేదట అని అడుగుతాడు. వస్తువుతో నీకెందుకని ప్రేమ బాధపడుతుంది.

మరొకవైపు ఇంటికి పెత్తనం వచ్చింది.. ఇక నేను చెప్పినట్లే వింటారని శ్రీవల్లి అనుకుంటుంది. పడుకున్న ప్రేమ దగ్గరికి వెళ్లి మొహంపై నీళ్లు చళ్లుతుంది శ్రీవల్లి. ఇది నీ పుట్టిల్లు కాదు రేపటి నుండి అయిదింటికి లేవాలని శ్రీవల్లి చెప్పగానే.. నేను లేవనని ప్రేమ అంటుంది. సరే ఇదే విషయం మావయ్య దగ్గరికి వెళ్లి చెప్తానని శ్రీవల్లి అంటుంది. తరువాయి భాగంలో ప్రేమ, నర్మద కలిసి భాగ్యం ఫ్యామిలీ గుట్టురట్టు చేస్తారు. ఇడ్లీ అమ్మడానికి వెళ్తున్న భాగ్యం వాళ్ళ దగ్గరికి రామరాజుని ప్రేమ, నర్మద లు తీసుకొని వెళ్తారు. రామరాజు ఆనందరావుని కొడతాడు. ఆ తర్వాత ఆనందరావుని తీసుకొని వెళ్లి శ్రీవల్లి ముందు పడేస్తాడు రామరాజు. అది చూసి శ్రీవల్లి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.