English | Telugu

Illu illalu pillalu : భాగ్యంకి దిమ్మతిరిగే షాకిచ్చిన రామరాజు.. ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -98 లో..... భాగ్యం రామరాజు ఇంటికి వస్తుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా మరి ఇప్పుడు నీ చదువు ఖర్చు మీ పుట్టింటివాళ్ళు చూసుకుంటున్నారా లేక మీ మావయ్య గారు చూసుకుంటున్నారా అని భాగ్యం ప్రేమని అడుగుతుంది. ప్రేమ సైలెంట్ గా ఉంటుంది. మీ పెద్దమ్మాయి మేం వచ్చామని వచ్చిందా లేక ఇక్కడే ఉంటుందా అని భాగ్యం అనగానే.. మాది పక్క వీధినే అని కామాక్షి అంటుంది.

కూతురు దగ్గర ఉండాలని ఇక్కడే ఇచ్చాడేమో మీ నాన్న అని భాగ్యం అంటుంది. నాకు ఇల్లంతా ఒకసారి చూడాలని ఉందని భాగ్యం అంటుంది. కామాక్షి వెళ్లి ఇల్లు చూపిస్తుంది. ఈ అమ్మాయికి కొంచెం పొగరు ఎక్కువలాగా ఉంది కట్ చెయ్యాలని భాగ్యం అనుకుంటుంది. ఇది మా అమ్మ నాన్నల బెడ్ రూమ్.. నడిపోడి బెడ్ రూమ్ ఇది.. చిన్నోడి బెడ్ రూమ్ అని కామాక్షి చెప్తుంది.. ఇవే ఇక అని కామాక్షి అనగానే మరి నా కూతురికి బెడ్ రూమ్ ఎక్కడ అని మనసులో అనుకుంటుంది రామరాజు వాళ్ల దగ్గరికి వెళ్లి అందరికి రూమ్ లు ఉన్నాయ్.. నా కూతురు అల్లుడికి లేదా అని అనగానే కట్టిస్తామని రామరాజు అంటాడు. ల్యాండ్ ల గురించి అడిగి తెలుసుకుంటుంది భాగ్యం. మీరు వచ్చారు.. మేమ్ కూడా వస్తామని రామరాజు అంటాడు. మీరెందుకని భాగ్యం కంగారు పడుతుంది. నా కొడుకు విషయం లో జాగ్రత్తగా ఉంటాను.. అన్నీ తెలుసుకొని ముందడుగు వేస్తానని రామరాజు అనగానే.. ఇక ఏం చెయ్యలేక ఇబ్బందిగానే సరే అంటుంది భాగ్యం.

ఆ తర్వాత టైమ్ కి నగలు తీసుకొని వచ్చవ్ రా అంటూ చందు సాగర్, తిరుపతి లు ధీరజ్ ని మెచ్చుకుంటారు. అందరు భోజనం చేస్తుంటే నీకు తిండి ఎలా సహిస్తుందిరా.. నాన్న మాట అంటే విలువ లేదు.. నా సొమ్ము ఎలా తింటున్నావని అనగానే ప్రేమ బాధగా అక్కడ నుండి లేస్తుంది. ఎందుకు తినేటప్పుడు అలా అంటారని వేదవతి అంటుంది. తరువాయి భాగంలో ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు.. నీ భార్య నువ్వు కష్టం చేసుకొని బ్రతకండి.. మీకు కావాల్సింది మీరే చూసుకోండి అని రామరాజు చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.