English | Telugu

Illu illalu pillalu : ప్రేమని అమ్మడానికి డీలింగ్.. భద్రవతి మాస్టర్ ప్లాన్ అదే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -30 లో.. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ గురించి కనుక్కో వాళ్ళని అడ్డుపెట్టుకొని రామరాజు పరువుతియ్యాలని భద్రవతి అనగానే.. సేనాపతి సరే అంటాడు. దాంతో భద్రవతి అమ్మ ఆ మాటలకూ బాధపడుతుంటే ఎందుకు అమ్మ.. అది మన ఇంటి పరువు తీసింది. వాళ్ళ గురించి నువ్వు బాధపడడం ఎందుకు అంటుంది. అది కూడా నా కన్నకూతురని వాళ్ళ అమ్మ అంటుంది.

మరొకవైపు మీ నాన్నని ఎంత మోసం చేసావని సాగర్ ని వేదవతి తిడుతుంది. నన్ను క్షమించు అమ్మ అని సాగర్ రిక్వెస్ట్ చేస్తాడు. నన్ను క్షమించు నాన్న అని సాగర్ అంటుంటే.. ఆ అమ్మాయి మొహం చూసి ఇంట్లోకి రానించానంతే కానీ చిన్నోడు లాగే వీడిని కూడా క్షమించలేదు.. నాతో మాట్లాడే ప్రయత్నం చేయ్యొద్దంటూ చెప్పేసి రామరాజు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కళ్యాణ్ ప్రేమని వేరొకరి అమ్మడానికి డీలింగ్ కుదుర్చుకుంటాడు.

ఆ తర్వాత ప్రేమ తన బాబాయ్ ని ధీరజ్ ఎక్కడ అని అడుగుతుంది. వాడు అంటే నీకు ఎంత ప్రేమ అని అతను అనగానే.. ప్రేమ కాదు.. ఏం కాదు.. నన్ను ఎప్పుడు తిడుతాడు.. అందుకే అని ప్రేమ అంటుంది. అప్పుడే ప్రేమకి కళ్యాణ్ ఫోన్ చేసి కలవాలని అంటాడు. దాంతో ప్రేమ సరే అంటుంది. మరొకవైపు ప్రసాదరావు నర్మద ఎంగేజ్మెంట్ కి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అప్పుడే సేనాపతిని తీసుకొని భద్రవతి వాళ్ళింటికి వస్తుంది. ఆల్రెడీ పెళ్లి అయిన అమ్మాయికి ఎంగేజ్ మెంట్ చేస్తున్నావని భద్రవతి అనగానే.. అందరూ షాక్ అవుతారు. తరువాయి భాగంలో రామారాజు ఇంటికి ప్రసాదరావు వచ్చి తనని తిడుతుంటే.. మా నాన్నకి ఏం సంబంధం లేదని సాగర్ అంటాడు సాగర్ ని ప్రసాదరావు కొట్టబోతుంటే నర్మద అడ్డువస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.