English | Telugu

Illu illalu pillalu : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో  సూపర్ ట్విస్ట్.. షాక్ లో రెండు కుటుంబాలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -27 లో..... వేదవతి సామూహిక వివాహం జరిగే దగ్గర ఉంటుంది. వాళ్ళని చూస్తే తమ కొడుకులు గుర్తుకువచ్చి సాగర్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఇక్కడ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. నాకు మీరే గుర్తు వచ్చారని అనగానే సాగర్ బాధపడుతాడు. ఆ తర్వాత నర్మద మెడలో సాగర్ తాళి కడతాడు.

మరొకవైపు సామూహిక వివాహాలు చేసుకున్న వాళ్లు రామరాజు వేదవతిల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. మనం కూడా అత్తయ్య, మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని నర్మద అనగానే సాగర్ వద్దని అంటాడు. ధీరజ్ ఒక సలహా ఇవ్వడంతో ఆశీర్వాదం కోసం వెళ్తున్న వారి వెనకాలే ఇద్దరు వెళ్లి రామారాజు వేదవతిల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత చెంచలమ్మతో మాట్లాడి రామరాజు వేదవతిలు అక్కడ నుండి వెళ్లిపోతారు. మరొకవైపు నర్మద, సాగర్ లు వెళ్తుంటే.. మీరెవరు ప్రేమ వివాహం చేసుకున్నారా అని చెంచలమ్మ అడుగుతుంది. పెద్దలని ఒప్పించి చేసుకోవాలి.. వెళ్లి పెద్దలను క్షేమించమని అడిగండి అని చెంచలమ్మ చెప్పగానే.. సరే అని చెంచలమ్మ దగ్గర సాగర్ నర్మదలు ఆశీర్వాదం తీసుకుంటారు.

ఆ తర్వాత ఇప్పుడు మనం వైజాగ్ వెళదామని సాగర్ అంటాడు. వద్దు మనం మీ ఇంటికి వెళదాం.. చెంచలమ్మ గారు చెప్పింది మర్చిపోయావా అని నర్మద అంటుంది. వద్దని సాగర్ అంటుంటే అప్పుడే ధీరజ్ వచ్చి.. తను చెప్పింది కరెక్ట్ ఇంటికి వెళ్ళాలని అంటాడు. తరువాయి భాగంలో నర్మద, సాగర్ లని తీసుకొని ధీరజ్ ఇంటికి వస్తాడు. వాళ్ళని చూసి భద్రవతి కుటుంబం ఓవైపు.. రామరాజు కుటుంబం మరోవైపు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.