English | Telugu

రోజా పై ఆది హాట్ కామెంట్స్....

హైపర్ ఆది ఒక చిట్ చాట్ లో రోజు గురించి చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 2024 ఎన్నికల తర్వాత రోజా గారి మీద మీ అభిప్రాయం ఏమిటి అనేసరికి రోజా గారికి పాలిటిక్స్ ఒక వ్యక్తి అంటే ఇష్టం. తనకు ఒక వ్యక్తి అంటే ఇష్టం అన్నారు. కానీ జబర్దస్త్ జడ్జ్ గా తనకు రోజా అంటే చాలా గౌరవం ఉందని చెప్పాడు ఆది. ఎందుకంటే తనకు కానీ తన లాంటి ఎంతో మంది కమెడియన్స్ కి పేరు వచ్చింది అంటే అది వాళ్ళ వల్లే అని చెప్పాడు ఆది. అలాగే లీడర్ గా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని గ్యాంగ్ లీడర్ గా చిరు అంటే ఇష్టం అని చెప్పాడు. ఇక పెళ్లి విషయానికి వచ్చేసరికి సోషల్ మీడియాలో చాలామంది తనకు పెళ్లిళ్లు చేసేశారని చెప్పాడు.

రియల్ లైఫ్ పెళ్లి ఎప్పుడు అంటే దానికి చాల టైం ఉందన్నాడు. పెళ్లి అయ్యింది అనే దానికన్నా పెళ్లి ఎప్పుడు అనేదే బాగుంటుంది. అదే కంటిన్యూ చేద్దాం అని చెప్పాడు. ఐతే దర్శి నుంచి ఎంఎల్ఏగా పోటీ చేస్తారు అని అన్నారు కానీ అది ఎందుకు జరగలేదు అని అడిగేసరికి..ఇదంతా సోషల్ మీడియాలో తన మీద అభిమానం వల్ల చేసిందే కానీ అలాంటిది ఏమీ లేదన్నాడు. అలాగే వ్యూయర్ షిప్ కోసం థంబ్ నెయిల్స్ చేశారు తప్పా ఈ పోటీలు ఏమీ లేవు..కేవలం పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేసినట్లు చెప్పాడు ఆది.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.